స్టుపిడ్ పీఎం: మోడీపై రషీద్ తీవ్ర వ్యాఖ్య, నెటిజన్ల ఫైర్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రషీద్ అల్వీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్టుపిడ్ పీఎం అంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఓ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో మాట్లాడారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే మోస్ట్ స్టుపిడ్ పీఎం అన్నారు.
మోడీ రెండేళ్ల పాలనపై రషీద్ అల్వీ మాట్లాడుతూ.. మోడీ మోస్ట్ స్టుపిడ్ ప్రధాని అన్నారు. ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకుంటారని రషీద్ అల్వీ.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీని ప్రశ్నించారు. రషీద్ అల్వీ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించిన స్మృతి ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోడీ పైన విషం చిమ్ముతున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు తాము ప్రధాని మోడీ గురించి మాట్లాడేటప్పుడు తమ పరిధిని గుర్తు తెచ్చుకోవాలన్నారు. పలువురు బీజేపీ నేతలు కూడా రషీద్ అల్వీ వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రషీద్ అల్వీ వ్యాఖ్యల పైన నెటిజన్లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.