తుపాకీతో కాల్చి, కత్తులతో నరికి, కార్పోరేటర్ ను ఇలా...
ముంబయి శివారు ప్రాంతంలో అత్యంత పాశవికంగా కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య మహరాష్ట్రలో సంచనలం సృష్టించింది.
ముంబై:ముంబయి శివారు ప్రాంతంలో అత్యంత పాశవికంగా కాంగ్రెస్ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య మహరాష్ట్రలో సంచనలం సృష్టించింది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పోరేటర్ మనోజ్ మెహట్రే మంగళవారం ప్రెస్ కాన్పరెన్స్ ముగించుకొని రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ఇంటికి వచ్చాడు.
కారును పార్క్ చేసి ఇంట్లోకి ప్రవేశిస్తుండగా ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు.దీంతో మనోజ్ అక్కడే కుప్పకూలిపోయారు. అంతటితో ఆగకుండా దుండగులు కిందపడ్డారు.
మనోజ్ పై కత్తులతో ఇష్టానుసారంగా దాడికి దిగారు దుండగులు. అయితే సిసి కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో మనోజ్ పై దాడి చేసి అక్కడి నుండి దుండగులు సులభంగా తప్పించుకొన్నారు.
తీవ్రంగా గాయపడిన మనోజ్ ను ఆసుపత్రికి తరలించగా ఆయన మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకొని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.భీవండి నిజాంపూర్ మున్సిఫల్ కార్పోరేషన్ కు వచ్చే మే లో ఎన్నికలు జరగనున్నాయి.