వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంకీర్ణ ప్రభుత్వాన్ని సిద్దరామయ్య కూల్చేస్తారు, మాజీ ప్రధాని ఫ్యామిలీ మీద 40 ఏళ్ల పగ: అశోక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభ్వుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూల్చేస్తారని ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆర్. అశోక్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ఎలాంటి ప్రయత్నాలు చెయ్యడం లేదని అన్నారు.

మాజీ సీఎం సిద్దరామయ్యకు మొదటి నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబ సభ్యులను చూస్తే కాదని ఆర్ అశోక్ ఆరోపించారు. మాజీ ప్రధాని దేవేగౌడ మీద సిద్దరామయ్యకు 40 ఏళ్లుగా ద్వేషం ఉందని, ఆ పగను ఇప్పుడు తీర్చుకుంటున్నారని ఆర్. అశోక్ ఆరోపించారు.

Congress leader Siddaramaiah will topple the Congress-JDS government says Ashok

దేవేగౌడ మీద ఉన్న ద్వేశాన్ని సిద్దరామయ్య ఎప్పుడు తీర్చుకుంటారో తమకే తెలీదని, ఆ విషయం సిద్దరామయ్యకు మాత్రమే తెలుసని ఆర్ అశోక్ అన్నారు. తాను సీఎం కుమారస్వామి సోదరుడు హెచ్.డి. రేవణ్ణ లాగా నిమ్మకాయలు చేతిలో పట్టుకుని తిరగడం లేదని ఆర్ అశోక్ వ్యంగంగా అన్నారు.

సిద్దరామయ్యను జేడీఎస్ నుంచి బయటకు గెంటేశారని, ఆ విషయాన్ని ఆయన ఇంకా మరిచిపోలేదని ఆర్ అశోక్ అన్నారు. ఇంత కాలం మనసులో దాచుకున్న పగను సిద్దరామయ్య ఇప్పుడు తీర్చుకోవాలని భావించారని బీజేపీ నేత ఆర్ అశోక్ ఆరోపించారు.

English summary
BJP leader R Ashok in Bidar said that, Congress leader Siddaramaiah will topple the Congress-JDS government. BJP will do nothing in it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X