సోనియా గాంధీకి స్వల్ప అస్వస్థత: సర్ గంగారాం ఆస్పత్రిలో చేరిక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదివారం సాయంత్ర స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. జ్వరం, శ్వాస సంబంధ సమస్యతో ఆమె ఆస్పత్రిలో చేరినట్లు తెలిసింది. వైద్యులు సోనియా గాంధీకి వైద్య పరీక్షలు నిర్వహించారు.
#UPDATE Delhi: Congress interim president Sonia Gandhi is admitted to the hospital for a routine check-up. https://t.co/VVQNj3i2FZ
— ANI (@ANI) February 2, 2020
గత కొంత కాలంగా సోనియా గాంధీ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సోనియా ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. సమాచారం తెలియడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. గత సంవత్సర కాలంగా సోనియా గాంధీ అమెరికాలో ప్రత్యేక వైద్య చికిత్స కూడా తీసుకుంటున్న విషయం తెలిసిందే.