'సుష్మా స్వరాజ్ కనిపించడంలేదు, కనిపిస్తే చెప్పండి'
కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కోసం మధ్యప్రదేశ్లోని విదీష నియోజకవర్గ వాసులు వెతుకుతున్నారంటున్నారు. విదీష నియోజకవర్గం నుంచి ఎన్నికైన సుష్మా ఇక్కడ పర్యటించి చాలా రోజులైంది.
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ కోసం మధ్యప్రదేశ్లోని విదీష నియోజకవర్గ వాసులు వెతుకుతున్నారంటున్నారు. విదీష నియోజకవర్గం నుంచి ఎన్నికైన సుష్మా ఇక్కడ పర్యటించి చాలా రోజులైంది.
అంతేకాదు స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి ఆమె పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. విదీష పట్టణంలోని పలుచోట్ల 'కనిపించని ఎంపీ కోసం వెతుకుతున్నాం' అని పేర్కొంటూ సుష్మా చిత్రంతో కూడిన పోస్టర్లను అతికించారు.
అంతేకాదు రైతుల ఆత్మహత్యలు, వారి బాధలు, యువతకు ఉపాధి కల్పన, తదితర సమస్యలను ఆ పోస్టరుపై పేర్కొన్నారు. ఈ పోస్టర్లను పలువురు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో ఇప్పుడివి వైరల్గా మారాయి.
మా ఎంపీ సుష్మాస్వరాజ్ని ఎవరైనా ఎక్కడైనా కలిస్తే విదీష నియోజకవర్గవాసులు ఆమె పట్ల ఎంతో అసహనంగా ఉన్నారని చెప్పాలని, ఆమె గురించి ఏమన్నా సమాచారం తెలిస్తే దయచేసి మాకు తెలియజేయాలని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.