మోడీకి మార్కెటింగ్ స్కిల్స్.. అందుకే బీజేపీకి మరోసారి అధికారం.. కాంగ్రెస్ నేత వింత కామెంట్స్
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగంపై లోక్సభలో సోమవారం నాడు ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ సందర్భంలో అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రపతిని ఎట్టిపరిస్థితుల్లో విమర్శించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ సభ్యులకు లేదని.. అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ఎత్తిచూపుతున్నామని వ్యాఖ్యానించారు.
కలిసిరాని అసెంబ్లీ.. ఊపు తెప్పించిన లోక్సభ.. ఇక మున్సిపల్ పోరులో నిలిచి గెలిచేనా?
కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాని మోడీయే కారణమన్నారు అధిర్. ఆయన గొప్ప సేల్స్ మ్యాన్ అని.. ఆయన అమ్మినట్లుగా మేము మా ప్రొడక్ట్స్ ను అమ్ముకోలేకపోయామని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశం తీవ్ర కరవు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే.. కేంద్ర ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్లయినా లేదని ఫైరయ్యారు.
2జీ కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. ఒకవేళ అందులో అవకతవకలు జరిగి ఉంటే యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఎందుకు జైల్లో లేరని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు మోడీని పొగడ్తల్లో ముంచి తేల్చడం తప్ప మరే పని చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఆయనను పొగిడితే చాలు.. మేం గట్టెక్కుతాం అన్న రీతిలో వారి వ్యవహారం నడుస్తోందని ఎద్దేవా చేశారు. అధిర్ ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర పదజాలం వాడినప్పుడు స్పీకర్ అడ్డు చెప్పారు. అమర్యాదగా మాట్లాడొద్దని హెచ్చరించారు.