వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎంపీ కాన్వాయ్ బీభత్సం: ముగ్గురు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
బీహార్లోని సపుల్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రంజీత్ రంజన్ కాన్వాయ్ సోమవారం బీభత్సం సృష్టించింది.
పాట్నా: బీహార్లోని సపుల్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రంజీత్ రంజన్ కాన్వాయ్ సోమవారం బీభత్సం సృష్టించింది. సపుల్లోని నిర్మాలి - సికార్హత ప్రధాన రహదారిలో ఆమె కాన్వాయ్లోని వాహనం ఢీకొని ముగ్గురు మృత్యువాత పడ్డారు.
ఈ ఘటన సమయంలో నిర్మలి బ్లాక్ కాంగ్రెస్ చీఫ్ రామ్ప్రసేష్ యాదవ్ కూడా అక్కడే ఉన్నారు. అయితే, ఈ ఘటనలో గాయపడిన వారిని ఆయన తన వాహనంలో ఎక్కించుకొని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం వారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ ఘటనపై స్థానికులు సదరు ఎంపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
congress mp convoy accident three dead patna bihar కాంగ్రెస్ ఎంపీ కాన్వాయ్ ప్రమాదం ముగ్గురు మృతి పాట్నా బీహార్
English summary
Congress MP from Bihar Ranjeet Ranjan's convoy on Monday crushed three people to death.
Story first published: Monday, August 21, 2017, 16:41 [IST]