వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మన్మోహన్ పై కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి, ఆర్ బి ఐ గవర్నరే కారణమా?
ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెనుకేసురావడాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి సందీప్ దీక్షిత్ తప్పుబట్టారు.
న్యూఢిల్లీ :రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెనుక వేసుకురావడం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు.
ఆర్ బి ఐ గవర్నర్ ను ప్రశ్నించే హక్కు పార్లమెంట్ కమిటీలకు ఉంటుందని మాజీ ఎంపి సందీప్ దీక్షిత్ చెప్పారు.ఈ విషయమై మన్మోహన్ సింగ్ ఉర్జిత్ ను వెనుకేసుకు రావడం సరైందికాదన్నారు.
మన్మోహన్ సింగ్ అంటే తనకు గౌరవమని చెప్పారు. ఆర్ బి ఐ గవర్నర్ ను ఆయన వెనుకేసుకు రావడం సమంజసం కాదన్నారు. ప్రశ్నించే హక్కు ఎంపిలకు ఉందన్నారు.
ఆర్ బి ఐ లాంటి సంస్థలు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సి ఉందన్నారు.పాత నగదు నోట్ల రద్దు వివరణ పై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఎదుట హజరైన ఉర్జిత్ కు మన్మోహన్ సింగ్ అండగా నిలిచారు.
Comments
manmohan singh rbi governor రిజర్వ్ బ్యాంకు మన్మోహన్ సింగ్ ఉర్జిత్ పటేల్ సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ రెస్క్యూ
English summary
congress party former mp sandeep dixit questioned former prime minister manmohansingh for resuing rbi governor urgit patel.
Story first published: Friday, January 20, 2017, 18:19 [IST]