ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోకుండా సెక్రటేరియట్ ఎలా కూల్చుతారు.....? కాంగ్రెస్
Recommended Video
కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన నేపథ్యంలో దాన్ని వ్వతిరేకిస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బృందం నేడు సెక్రటేరియట్ను సందర్శించింది. ఈనేపథ్యంలోనే తాజా పరిస్థితులను పరీశీంచేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క,ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డితోపాటు ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పోన్నం ప్రభాకర్తో పాటు ఇతర మాజీ ఎమ్మెల్యేలు పాల్గోన్నారు.
ఈ సంధర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ ...సెక్రటేరియట్ భవనాల న్యాణ్యత సరిగా ఉన్నా వాటిని ఎందుకు కూల్చుతున్నారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు..పటిష్టంగా ఉన్న సెక్రటేరియట్ను కూల్చడం వల్ల ప్రజా ధనం వృధా అవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే నూతన సచివాలయ నిర్మాణం సీఎం కేసీఆర్ వ్యక్తిగతం కాదని సీఎల్పీ భట్టి విక్రమార్క విమర్శించారు..కాగా ముఖ్యమంత్రి చేస్తున్న చర్యలను తుగ్లక్ చర్యలుగా ఆయన అభివర్ణించారు.కాగా కేసిఆర్ వ్యక్తిగతంగా భననాలు నిర్మించుకుంటే తమకు అభ్యంతరం లేదని చెప్పిన ఆయన ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా భవనాలను నిర్మించడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే ప్రజాధనం ఖర్చు పెడుతున్నప్పుడు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని అన్నారు.
ఇక సెక్రటేరియట్కే రాని ముఖ్యమంత్రి కేసీఆర్కు భవనాల నాణ్యత ఎలా తెలుస్తోందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ప్రస్థుత భవనాలు పరీశీంచిన తర్వాతే నూతన భవనాల నిర్మాణాలను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రజా ధనం వృధా కావద్దనే ఉద్దేశ్యం తప్ప తమకు ఇతర అభిప్రాయం లేదని అన్నారు.