ఉడిపిలో లొట్టలు వేస్తూ నీరు దోసె, సీగేడి సాంబార్ ఆరగించిన రాహుల్ గాంధీ, సూపర్ !
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ప్రత్యేక విమానంలో మంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో ఉడిపి చేరుకున్న రాహుల్ గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓ మత్స్యకారుడి ఇంటికి వెళ్లిన రాహుల్ గాంధీ వారిలో ఇంటిలో తయారు చేసిన నీరు దోసె, సీగేడి సాంబార్ లొట్టలు వేసుకుంటూ తిన్నారు. రాహుల్ గాంధీ దక్షిణ కన్నడ జిల్లాలో రెండురోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొని దేవాలయాలు, దర్గా, చర్చిలకు భేటీకానున్నారు.
తెంక ఎర్మాళ్
మంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఉడిపిలోని తెంక ఎర్మాళ్ హెలిప్యాడ్ చేరుకున్న రాహుల్ గాంధీ తరువాత పక్కనే ఉన్న స్కూల్ కు వెళ్లి కొంత సేపు విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం సమీపంలోని మత్స్యకారుడి ఇంటికి రాహుల్ గాంధీ వెళ్లారు. అనంతరం మత్య్సకారులతో భేటీ అయ్యి చర్చించారు.
నీరు దోసె సూపర్
ఉత్తర కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేసిన సమయంలో రాహుల్ గాంధీ రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణంలోకి వెళ్లి వేడివేడి మిరపకాయ బజ్జీలు తిని టీ తాగారు. ఇప్పుడు దక్షిణ కర్ణాటకలోనే ప్రసిద్ది చెందిన నీరు దోసె, సీగేడి సాంబార్ ను మత్య్సకారుడి ఇంటిలో రాహుల్ గాంధీ లొట్టలువేసుకుంటూ తిన్నారు.
సీఎంకు నో నీరు దోసె
దక్షిణ కర్ణాటకలో ప్రసిద్ది చెందిన నీరు దోసె, సిగేడి సాంబార్ ను రాహుల్ గాంధీ లొట్టలు వేసుకుంటూ తింటుంటే పక్కనే కుర్చుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఒక్క దోసె కూడా తినకుండా చూస్తూ ఉండిపోయారు. రాహుల్ గాంధీ వెంట వెళ్లిన లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే సమీపంలోని సముద్రం చూస్తూ బీచ్ లో సంచరించారు.
పొలిటికల్ ఇన్సిట్యూట్
ఉడిపిలో రాజీవ్ గాంధీ పొలిటికల్ ఇన్సిట్యూట్ ను రాహుల్ గాంధీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంలో రాహుల్ గాంధీ వివిధ అంశాలపై మాట్లాడారు. మంగళవారం రాత్రి 7 గంటలకు మంగళూరులోని రోసారియో చర్చికి, తరువాత గోకర్ణశ్వేర దేవాలయంకు, రాత్రి 8 గంటలకు ఉల్లాళలోని దర్గాకు రాహుల్ గాంధీ భేటీ అవుతున్నారు.