ఢిల్లీ ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ - బులిటెన్ విడుదల చేసిన వైద్యులు..
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. గురువారం సాయంత్రం 7 గంటలకు న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్లో ఆమె అడ్మిట్ అయ్యారు. కొంతకాలంగా సోనియా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం, ప్రస్తుతం కరోనా కాలం కావడంతో ఆస్పత్రిలో సోనియా చేరిక కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది. దీంతో డాక్టర్టు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
సోము వీర్రాజు vs సుజనా చౌదరి - రాజధానిపై సంచలన వ్యాఖ్యలు - బీజేపీ చీఫ్తో ఎంపీ విభేదం
ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, రొటీన్ టెస్టులతోపాటు ఇన్వెస్టిగేషన్స్ కోసమే ఆమె ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని శ్రీ గంగా రామ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా బులిటెన్ లో పేర్కొన్నారు. ఫిబ్రవరిలో కడుపు నొప్పి కారణంగా సోనియా ఇదే ఆస్పత్రిలో చేరడం గమనార్హం. గురువారం ఉదయం నుంచి సోనియా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొన్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.
Recommended Video
దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ రాజ్య సభ ఎంపీలతో సోనియా మాట్లాడారని, పలువురు కీలక నేతలతో కరోనా పరిస్థితులపై చర్చలు జరిపారని, ఈ రెండు మీటింగ్ లనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారని, వాటిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తోపాటు పార్టీ టాప్ లీడర్స్ పాల్గొన్నారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.