షాక్: నిన్న తప్పులో కాలేసిన కరుణానిధి, నేడు అఖిలేష్ హడావుడి..
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హడావుడిగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సమాజ్ వాది పార్టీని ఓటమిలోకి నెట్టారని ములాయం సింగ్ యాదవ్ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హడావుడిగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సమాజ్ వాది పార్టీని ఓటమిలోకి నెట్టారని ములాయం సింగ్ యాదవ్ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ గాంధీతో ఎవరు కలువమన్నారు, ఎందుకు పోటీ చేశారని నిలదీస్తున్నారు. అఖిలేష్ తొందరపడ్డారని చెప్పారు. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం తమకు భయం లేదని బీజేపీ పలుమార్లు ఎద్దేవా చేసింది.
ప్రియాంక కాగితపు పులి: స్మృతి, 'యూపీలో ఇక రామరాజ్యం'
ఇప్పుడు ఉత్తర ప్రదేశ్లో సమాజ్ వాది పార్టీని ఓటమి బాట పట్టించినట్లే.. గతంలో తమిళనాడులోను డిఎంకేను కాంగ్రెస్ ఓడించిందని గుర్తు చేస్తున్నారు.
యూపీలో ఏమాత్రం ప్రభావం లేని కాంగ్రెస్ పార్టీకి అఖిలేష్ వందకు పైగా సీట్లు ఇచ్చారని, కానీ సింగిల్ డిపాజిట్కే పరిమితమైంది. వందకు పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం, ఆ పార్టీతో పొత్తు కారణంగా ఎస్పీ ఘోర పరాజయం చవి చూసిందంటున్నారు.
గత ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకెతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. అప్పుడు బలవంతంగా 41 సీట్లు దక్కించుకుంది. కానీ కేవలం 8 స్థానాల్లోనే గెలిచింది. అది డీఎంకేకు పెద్ద నష్టం చేసింది. ఇప్పుడు ఎస్పీని ఓడించింది.