కాంగ్రెస్ ‘వార్ రూం’లోకి బాలీవుడ్ బ్యూటీ!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ వార్ రూంగా పేరొందిన భవనాన్ని ప్రముఖ నటి, రాజ్యసభ సభ్యురాలు రేఖకు అధికారిక నివాసంగా కేటాయించారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని రకబ్ గంజ్లోని ఓ ఇంటిని కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాల నిర్వహణకు వినియోగిస్తుంటుంది.
ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఆ భవనానికి నిరంతరం వచ్చిపోతుంటారు. దీంతో ఆ భవనాన్ని కాంగ్రెస్ వార్ రూంగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడీ భవనాన్ని పార్లమెంటు సభ్యురాలు రేఖకు అధికారిక నివాసంగా అధికారులు కేటాయించారు.
దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భవనాన్ని రేఖకు నివాసంగా కేటాయించిన విషయం తమ పార్టీకి తెలియదని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అవసరమైతే తాము వేరే చొట చర్చలు జరుపుకుంటామని చెప్పారు.
తెలంగాణకు చెందిన రాజ్యసభ ఎంపీ పేరున కేటాయించడిన ఈ భవనాన్ని నిన్నటి( బుధవారం) వరకు కాంగ్రెస్ పార్టీ తమ వార్ రూంగా వినియోగించింది. 2009, 2014 లోకసభ ఎన్నికల సందర్భాల్లో ఈ భవనంలోనే కాంగ్రెస్ నేతలు చర్చలు జరిపారు.