వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ నలుగురు: గుల్బర్గా, బీదర్‌కు కాంగ్రెస్ ప్రత్యేక హెలికాప్టర్లు

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో క్షణక్షణానికి రాజకీయం మారుతోంది.ఈ తరుణంలో షాంగ్రీలా హోటల్ కు తమ పార్టీ ఎమ్మెల్యేలను తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. మరో వైపు గుల్బర్గా, బీదర్ ప్రాంతాలకు రెండు ప్రత్యేక హెలిక్యాప్టర్లను కాంగ్రెస్ నాయకత్వం పంపింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను బెంగుళూరుకు రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ హెలిక్యాప్టర్లను ఏర్పాటు చేసింది. ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయాడు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను అత్యవసరంగా బెంగుళూరుకు రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ గా ప్రయత్నాలు ప్రారంభించింది. బిజెపికి స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 105కు చేరుకొంది.

Congress sent special plane to Gulbarga for bring 4 mlas

అయితే కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు గైరాజర్ అయ్యారు. అయితే గైరాజరయ్యారు. ఆనంద్ సింగ్, నాగేంద్ర, రాజశేఖర పాటిల్, భీమానాయర్ ఆమెర్ గౌడలు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశానికి దూరంగా ఉన్నారు. అయితే వీరు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షసమావేశానికి హజరుకాకపోవడం పట్ల ఆ పార్టీ నాయకత్వంలో ఆందోళన మొదలైంది.

దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష సమావేశానికి దూరంగా ఉన్న ఎమ్మెల్యేలను బెంగుళూరుకు రప్పించేందుకుగాను ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ రెండు హెలిక్యాప్టర్లను గుల్బర్గా, బీదర్ ప్రాంతాలకు పంపింది. ఈ ఎమ్మెల్యేలను ప్రత్యర్ధుల చేతులకు చిక్కకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకొంటుంది.

మరో వైపు జెడి(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేలంతా షాంగ్రీల్లా హోట‌ల్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కూడ అక్కడే ఉంచేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. అయితే జెడి(ఎస్) ఎమ్మెల్యేలను కేరళలోని రిసార్ట్‌కు తరలించాలని ఆ పార్టీ నాయకత్వం తాజాగా నిర్ణయం తీసుకొంది.

English summary
congress sent special plane to Gulbarga to bring 4 cong MLAs to Bangalore as they are suspected to be ready to defect to BJP camp by abstaining from jds-cong confidence motion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X