లైంగిక వేధింపులు, కాంగ్రెస్ లీడర్ అరెస్టు. మాజీ ఎం, నటి రమ్య క్లారిటీ. 39 మంది!
Recommended Video
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) సోషల్ మీడియా సెల్ విభాగంలో మహిళా సిబ్బంది మీద లైంగిక వేధింపులు జరిగాయని వెలుగు చూడటంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆ పార్టీ నాయకుడిని అరెస్టు చేశారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్, మాజీ ఎంపీ, నటి రమ్య అలియాస్ దివ్యా స్పందన వివరణ ఇచ్చారు.
ఏఐసీసీ మాజీ మహిళా ఉద్యోగి చేసిన లైంగిక వేదింపుల ఫిర్యాదుపై కాంగ్రెస్ పార్టీ అంతర్గత ప్రత్యేక కమిటీ విచారణ చేస్తోందని ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్, నటి రమ్య ట్వీట్ చేశారు. గతంలో ఏఐసీసీ సోషల్ మీడియాలో పని చేసిన మహిళ తన మీద లైంగిక వేధింపులు జరిగాయని ఆరోపించారు.
మాజీ ఉద్యోగిని చేసిన ఫిర్యాదుపై ప్రత్యేక కమిటీతో విచారణ జరిపిస్తున్నారని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిఫ్టానం తగిన చర్యలు తీసుకుంటుందని నటి రమ్య సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. అయితే జులై మొదటి వారంలో రమ్య మరో విదంగా స్పందించారు.
ఏఐసీసీ సోషల్ మీడియాలో పని చేసిన మాజీ మహిళా ఉద్యోగి చేసిన ఫిర్యాదులో ఎలాంటి వాస్తవం లేదని నటి రమ్య వివరణ ఇచ్చారు. లైంగిక వేదింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఐసీసీ సోషల్ మీడియా ఉద్యోగి చిరాక్ పట్నాయక్ చాల మంచి వ్యక్తి అని 39 ఉద్యోగులు సంతకాలు చేసి అధిష్టానానికి ఇచ్చారని రమ్య జులై మొదటి వారంలో వివరణ ఇచ్చారు.
ఏఐసీసీ సోషల్ మీడియా టీంలో పని చేస్తున్న చిరాగ్ పట్నాయక్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని అక్కడే పని చేసిన మహిళ ఆరోపించారు. ఈ విషయంపై అప్పట్లో సోషల్ మీడియా ఇన్ చార్జ్ రమ్యకు ఫిర్యాదు చేసినా ఆమె పట్టించుకోలేదని మాజీ మహిళా ఉద్యోగి ఆరోపించారు.
విదిలేని పరిస్థితుల్లో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీసులు చిరాగ్ పట్నాయక్ మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇటీవల చిరాగ్ పట్నాయక్ కు బెయిల్ రావడంతో ఏఐసీసీ సోషల్ మీడియా ఇన్ చార్జ్ రమ్య చిరాగ్ పట్నాయక్ విషయంలో స్పందించారు.