టెర్రరిస్టుగా చూపించాలని చూస్తోంది: కాంగ్రెస్పై రామ్దేవ్

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోగ్యం కోసం తాను ప్రార్థనలు చేస్తానని, వచ్చే ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయకపోవచ్చునని, దాంతో అనివార్యంగా రాహుల్ గాంధీని దూకుడుగా ముందుకు తెస్తోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెసు తనను టెర్రరిస్టుగా చూపించే ప్రయత్నాలు చేస్తోందని ఆయన విమర్శించారు.
రాహుల్ గాంధీకి చరిష్మా లేదని, నాయకత్వ లక్షణాలు లేవని, దానివల్ల వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసుకు వంద సీట్లు కూడా రావని, ఈ స్థితిలో పార్టీని రాహుల్ గాంధీ ఐక్యంగా ఉంచలేరని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెసు పార్టీని రద్దు చేయాలనే మహాత్మా గాంధీ కలను రాహుల్ గాంధీ నెరవేరుస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ కన్నా ఎక్కువ చరిష్మా ప్రియాంక గాంధీకి ఉందని, అయితే మగపిల్లలపై ఉండే ప్రేమ కొద్ది సోనియా రాహుల్ గాంధీని ఎంపిక చేసుకున్నారని ఆయన అన్నారు. రాహుల్కు గాంధీ అనేది ఉందని, అయితే మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని రాహుల్ ఆచరించడం లేదని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ అమాయకుడని, స్వార్థ ప్రయోజనాలు గల నాయకుల గుంపు రాహుల్ను ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకు చరిష్మాతో కూడిన వ్యక్తిత్వం, మాస్ అపీల్ ఉన్నాయని, ప్రజలు మోడీ ప్రసంగాలను వినడానికి ఉత్సాహం ప్రదర్శిస్తారని ఆయన అన్నారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications