వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండో విడత కోవిడ్ వ్యాక్సిన్: ప్రధాని మోడీతో పాటు సీఎంలకు: వారికి మాత్రం ఆ తర్వాతే..!

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఇప్పుడు హాట్ టాపిక్‌. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ముందుగా హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఇవ్వడం జరిగింది. అయితే తొలి విడత కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మాత్రం రాజకీయనాయకులు ఇతర ప్రజాప్రతినిధులకు వ్యాక్సిన్ ఇవ్వలేదు. ఇక రెండో విడత వ్యాక్సినేషన్ సందర్భంగా ప్రధాని మోడీతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడి ఉన్న రాజకీయ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Recommended Video

#Vaccination రెండో దశ‌లో ప్రధాని మోదీతోపాటు 50 ఏళ్లు దాటిన సీఎంల‌కు క‌రోనా టీకా

 కరోనా సోకి 4 లక్షల మంది మృతి: స్మారక స్థూపం వద్ద జో బిడెన్ కన్నీరు: డెలావర్ బిడ్డగా కరోనా సోకి 4 లక్షల మంది మృతి: స్మారక స్థూపం వద్ద జో బిడెన్ కన్నీరు: డెలావర్ బిడ్డగా

హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే పోలీసులు, త్రివిధ దళాలు, పారిశుద్ధ్య కార్మికుల తర్వాత 50 ఏళ్ల పైబడి వయసున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వివిధ రకాల జబ్బులతో బాధపడుతూ 50 ఏళ్లకు తక్కువ వయసున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. గతేడాది నవంబర్ 24వ తేదీన ప్రధాని మోడీ ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో వ్యాక్సిన్‌ ప్రాధాన్యత క్రమం చర్చించడం జరిగింది.

Corona Vaccine: PM Modi and CMs will be vaccinated in phase 2, reveals sources

భారత్‌లో హైపర్ టెన్షన్, మధుమేహం, గుండెపోటు లాంటి జబ్బులు తక్కువ వయసున్న వారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయని...పాశ్చాత్య దేశాల్లో ఈ కోవ తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకే 50 ఏళ్ల వయసున్న వారికి వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా .

ఇదిలా ఉంటే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా సీరం సంస్థ తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్‌కు అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.ఇదే తరహాలు భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాగ్జిన్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతుండటం విశేషం.

English summary
PM Modi and all state CM's will be administered with covid-19 in the second phase if sources are to be believed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X