Coronavirus: బెంగళూరు టెక్కీకి పాజిటివ్, పంజాబ్లో తొలికేసు, 45కు చేరిక
బెంగళూరు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్(కొవిడ్-19) ఇప్పుడు భారతదేశాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. ఇందుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులే కారణం. తాజాగా, మరో రెండు పాజిటివ్ కేసులు వెలుగుచూడటం మరింత ఆందోళనలకు గురిచేస్తోంది.
Recommended Video
అమెరికా నుంచి తిరిగి వచ్చిన బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్కు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. మరో కేసు పంజాబ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఇటలీ నుంచి తిరిగి వచ్చిన పంజాబ్ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ణారణ అయ్యింది. దీంతో భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య 45కు చేరింది.
అమెరికా నుంచి బెంగళూరుకు వచ్చిన టెక్కీకి కరోనావైరస్ పాజిటివ్గా తేలినట్లు కర్ణాటక వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ వెల్లడించారు. వైరస్ సోకిన వ్యక్తిని ఆయన కుటుంబాన్ని బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఛాతి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచినట్లు తెలిపారు. బాధితుడు మొదట అమెరికాలోని ఆస్టిన్ నగరానికి ప్రయాణించి అక్కడ్నుంచి న్యూయార్క్ దుబాయ్ మీదుగా భారత్ చేరుకున్నట్లు తెలిసింది.
Karnataka Medical Education Min Dr. K Sudhakar: The wife & child of Bengaluru Coronavirus patient have been quarantined. He returned to Bengaluru from the US on Mar 1, and developed symptoms on March 5. A colleague who was travelling with him has also been quarantined. pic.twitter.com/LWkAlVUVaM
— ANI (@ANI) March 9, 2020
మరో కేసు పంజాబ్ రాష్ట్రంలో నమోదైంది. పంజాబ్ రాష్ట్రంలో తొలిసారి నమోదైన కరోనా కేసు ఇదే కావడం గమనార్హం. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని పంజాబ్ అధికారులు వెల్లడించారు.
Ministry of Health and Family Welfare: One more case has been reported from Punjab. Thus, as of now there are 44 confirmed cases of #COVID19 in the country (3 positive cases from Kerala which are now discharged). #Coronavirus pic.twitter.com/fEcXqRj1Z9
— ANI (@ANI) March 9, 2020
కాగా, ఇటలీలో కరోనావైరస్ బారిన పడి 366 మంది మృతి చెందగా, 7వేల మందికిపైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అమెరికాలో కూడా కరోనా విజృంభిస్తోంది. దాదాపు 30మంది కరోనాబారిన పడి మృతి చెందారు. వందమంది వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.