12 లక్షల మార్క్నకు చేరువలో వైరస్, 28 వేల మంది మృతి, దేశంలో కరోనా లెక్కలివే..?
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విజృంభణ కొనసాగుతోంది. దేశంలో 11 లక్షల 92 వేల 915 మందికి వైరస్ వచ్చిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్లో పేర్కొన్నది. ఇందులో 4 లక్షల 11 వేల 133 యాక్టివ్ కేసులు కాగా.. 7 లక్షల 54 వేల 50 మంది వైరస్ సోకి కోలుకున్నారు. 28 వేల 732 మంది చనిపోయారు.
కరోనా పాజిటివ్ కేసులు మహారాష్టలో ఎక్కువగా వస్తున్నాయి. బుధవారం కూడా 10 వేల పైచిలుకు కేసులు వచ్చాయి. తమిళనాడులో 5 వేల పైచిలుకు కేరళలో వెయ్యి పైచిలుకు కేసులు వచ్చాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో 6 వేల 45 కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో దేశంలో కరోనా వైరస్ కేసులు 12 లక్షల మార్క్నకు చేరువలో ఉంది.
Recommended Video
కరోనా వైరస్ కేసుల్లో ప్రపంచంలో భారతదేశం మూడోస్థానంలో ఉంది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ కొనసాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కోటి 49 లక్షల పైచిలుకు మందికి వైరస్ సోకింది. ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల 17 వేల 415 మంది వైరస్ సోకి చనిపోయారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రావడం కాస్త ఊరటనిచ్చే అంశం.