దేశంలో 4కు చేరిన కరోనా మృతుల సంఖ్య: పంజాబ్లో తొలి మరణం
న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 172 మందికి కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వందలాది మంది అనుమానితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే కరోనాబారినపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో మరణం చోటు చేసుకుంది.
పంజాబ్ రాష్ట్రంలో కరోనాబారినపడిన ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. పంజాబ్ రాష్ట్రం బంగాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆ వృద్ధుడు చనిపోయాడు. అయితే, అతని రిపోర్టులు గురువారం వచ్చాయి. ఆ రిపోర్టుల్లో వృద్ధుడికి కరోనా పాజిటివ్ అని తేలింది.
మృతుడు బల్దేవ్ సింగ్(70) ఇటీవలే ఇటలీ, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. కరోనాపాజిటివ్ సోకిన ఇతడు గుండెపోటు రావడంతో బుధవారం మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కరోనా తొలి మరణం కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకోగా.. ఢిల్లీ రెండో మరణం సంభవించింది.
The total number of positive cases of #COVID19 in India stands at 167 (including 25 foreigners), 4 deaths (1 each) in Delhi, Karnataka, Punjab and Maharashtra: Ministry of Health and Family Welfare pic.twitter.com/sk4rfzvlUE
— ANI (@ANI) March 19, 2020
Recommended Video
మూడో మరణం మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా మరణంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4కు చేరింది. 172 మందికి పాజిటివ్ అని తేలింది. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ ఎక్కువగా నమోదవడం గమనార్హం. ఇక తెలంగాణలో 13, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాయి.