వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown: ముంబై తర్వాత ఢిల్లీ, ఇక్కడే ఉండండి, కూలీలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ పిలుపు

|
Google Oneindia TeluguNews

లాక్‌డౌన్ పొడిగించడంతో మహారాష్ట్రలో వలసకూలీలు బాంద్రా రైల్వేస్టేషన్‌కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొనగా.. ఢిల్లీ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. దేశ రాజధానిలో ఉన్న కూలీలు ఎక్కడివారు అక్కడే ఉండాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. అయితే ఇప్పటికే కొందరు కూలీలు గతనెలలో ఢిల్లీ నుంచి వెళ్లిపోవడంతో.. ఇప్పుడు కూడా వెళతారమోననే ఆందోళన నెలకొంది.

లాక్‌డౌన్ మే 3 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో వలసకూలీలు రాష్ట్రంలోనే ఉండాలని అరవింద్ కేజ్రీవాల్ కోరారు. అప్పటివరకు అందరూ క్రమశిక్షణతో ఉండాలని పేర్కొన్నారు. గత 21 రోజుల ఉన్న మాదిరిగానే.. మే 3 వరకు కూడా ఉండాలని తెలిపారు. ఈ మేరకు ట్వీట్టర్‌లో వీడియో రిలీజ్ చేశారు. అదే సమయంలో పుకార్లను ప్రజలు నమ్మొద్దని కోరారు. మరికొందరు బస్సులు ఉన్నాయని, ఇంటికి తీసుకెళతామని మోసం చేస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Coronavirus: Delhi CM appeals migrant workers to stay here..

లాక్‌డౌన్ మే 3వ తేదీ వరకు ప్రధాని మోడీ పొడిగించడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వాగతించారు. కరోనా వైరస్ నుంచి బయటపడాలంటే సామాజిక దూరం పాటించాలని కోరారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal issued an appeal to migrant workers to stay where they are till the lockdown ends on May 3.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X