Coronavirus: 376 మంది విదేశీ తబ్లీగిలపై ఎఫ్ఐఆర్, వీసా ఇచ్చింది ఎందుకు ? ఏం చేశారు ?
న్యూఢిల్లీ/ముంబై: దేశంలో కరోనా వైరస్ (COVID 19) హాట్ స్పాట్ అయిన ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన 376 విదేశీయుల మీద కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 376 మంది తబ్లీగి విదేశీయులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విసా నియమాలు ఉల్లంఘించారని, కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కారణం అయ్యారని తదితర 34 సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. మీకు వీసా ఇచ్చింది ఎందుకు ? మీరు ఏం చేశారు ? అని తబ్లీగిలను అధికారులు ప్రశ్నిస్తున్నారు. తబ్లీగి జమాత్ సభ్యుల మీద అనేక సెక్షన్ ల కింద నమోదు కావడంతో ఆ సంస్థ సభ్యులు హడలిపోయారు.
Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?
వీళ్ల దెబ్బతో కరోనా ?
ఢిల్లీలోని నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన విదేశీయులు వీసా నియమాలు ఉల్లంఘించి అక్కడి నుంచి దేశం మొత్తం సంచరించారని, కరోనా వైరస్ తో పాటు అంటు రోగాలు వ్యాపించడానికి కారణం అయ్యారని అధికారులు గుర్తించారు. తబ్లీగి జమాత్ సమావేశాలకు మాత్రం హాజరుకావాలని వీసాలు ఇస్తే వారు అక్కడి నుంచి అధికారుల అనుతి లేకుండా దేశం మొత్తం తిరిగి ఒక్కొక్కరికి కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం అయ్యారని అధికారులు గుర్తించారు.
విదేశాల నుంచి వచ్చింది ఎందుకు ?
థాయ్ ల్యాండ్, శ్రీలంక, బాంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్రికా, మలేషియా, అమెరికా, ఆస్ట్రేలియా, కజకిస్థాన్, ఇంగ్లాడ్, చైనా, రష్యా, ఈజిప్టు, రష్యా, జోడ్డాన్, ట్యూనోషియా, బెల్జియం, ఉక్రేన్, ఈజిప్టు, సౌది, ఉక్రేన్, ఫిజి తదితర దేశాల నుంచి 294 మంది విదేశీయులు ఢిల్లీలోని నిజాముద్దీన్ లోని తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైనారు. ధార్మిక సమావేశాలు అయిన తబ్లిగి జమాత్ సమావేశాలకు హాజరు కావడానికి మాత్రమే వీరికి భారత్ వీసాలు మంజూరు చేసింది.
దేశం మొత్తం తిరిగేశారు
ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన వారు ఆ సమావేశాలు పూర్తి అయిన తరువాత వారు అధికారుల అనుమతి లేకుండా దేశం మొత్తం తిరిగేశారని, కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం అయ్యారని అధికారులు గుర్తించారు. ఢిల్లీ తబ్లీగి జమాత్ సమావేశాలకు హాజరైన వారు ఎక్కడెక్కడ తలదాచుకున్నారు ? అని దేశం మొత్తం గాలించారు.
తిక్కచేష్టలు చేస్తే దూల తీరింది
ధార్మిక సమావేశాలకు హాజరుకావడానికి వచ్చి కరోనా వైరస్ వ్యాధిని అంటించుకుని దేశం మొత్తం తిరిగి అనేక మందికి అంటు వ్యాధి అంటించారని అధికారులు కేసులు నమోదు చేశారు. ఢిల్లీ జమాత్ సమావేశాలకు హాజరైన 376 మంది విదేశీయుల మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో తబ్లీగి జమాత్ సభ్యులు హడలిపోయారు.