వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: చైనీయుల విసాలన్నీ రద్దు చేసిన భారత్: విమానం ప్రయాణంపై నిషేధం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటించడానికి చైనీయులకు జారీ చేసిన విసాలన్నింటినీ మనదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ రద్దు చేసింది. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి మరణించిన చైనీయులు సంఖ్య రోజురోజుకూ భారీగా పెరిగిపోతుండటం, వేలాదిమందిలో కరోనా వైరస్ జాడ కనిపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారత్.. ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వైరస్ సోకిన చైనీయులు భారత్‌కు బయలుదేరి వచ్చే అవకాశాలు ఉన్నందున విసాలన్నింటినీ రద్దు చేసింది.

Recommended Video

Coronavirus : Andhra Girl Jyothi Seeking For Help In China | పది రోజుల్లో పెళ్లి.. ఇంతలో చైనా వెళ్లి

ఈ విషయాన్ని చైనాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రబలిపోవడానికి ముందే విసాలను పొంది ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోన్న చైనీయుల విసాలు కూడా రద్దయినట్లుగానే భావించాలని పేర్కొన్నారు. ఇదివరకే మంజూరు చేసిన విసాలన్నీ రద్దయ్యాయని, కొత్త విసాల కోసం బీజింగ్, షాంఘై, గ్వాంగ్ఝౌ నగరాల్లో ఉన్న భారత రాయబార, కాన్సులేట్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు.

Coronavirus: Existing Visas No Longer Valid For Passengers From China

ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోన్న చైనీయులు తమదేశ రాయబార కార్యాలాయన్ని వెంటనే సంప్రదించాలని ఆదేశించారు. కిందటి నెల 15వ తేదీ తరువాత చైనా నుంచి భారత పర్యటనకు వచ్చిన వారంతా వెంటనే కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యాలయం హాట్ లైన్ నంబర్ +91-11-23978046ను సంప్రదించాలని అన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనల ప్రకారం.. నడుచుకోవాల్సి ఉంటుందని, సమీప ఆసుపత్రుల్లో తప్పనిసరిగా వైద్య పరీక్షలను చేయించుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

దీనితోపాటు- కరోనా వైరస్ బారిన పడిన చైనా నుంచి ఏ ఒక్క చైనీయుడిని గానీ, ఇతర విదేశీ ప్రయాణికుడిని గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కించుకోవద్దంటూ మనదేశ పౌర విమానయాన సంస్థలకు కూడా కఠిన ఆదేశాలను జారీ చేశారు. భారత్-చైనా మధ్య రాకపోకలు సాగిస్తోన్న ప్రతి పౌర విమానయాన సంస్థ కూడా ఈ ఆదేశాలను పాటించాల్సి ఉంటుందని అన్నారు. కరోనా వైరస్ సోకిన చైనీయులను గుర్తించడం కష్టతరమైనందున.. ఇదివరకే విసాలు పొందిన వారిని ప్రయాణించడాన్ని నిరాకరించాలని చెప్పారు.

English summary
India has cancelled all visas from China issued since January 15 after an outbreak of the deadly Novel Coronavirus claimed over 400 in the neighbouring country. The Indian Government has said that existing visas are “no longer valid” for passengers from China. “All airlines are informed not to take on board any passenger from china including Chinese or other foreign nationals,” the MHA said in a notification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X