Lockdown: ప్రభుత్వ స్కూల్ లో మహిళపై గ్యాంగ్ రేప్, కామాంధుడు కానిస్టేబుల్, ఫ్రెండ్స్, బస్సు లేక!
జైపూర్: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చెయ్యడంతో ఊరికి వెళ్లడానికి అవకాశం లేక ఓ ప్రభుత్వ స్కూల్ లో తలదాచుకున్న మహిళపై కామాంధులు సామూహిక అత్యాచారం చేశారు. మహిళ మీద సామూహిక అత్యాచారం చేసిన కేసులో ఒక హెడ్ కానిస్టేబుల్ తో పాటు అతని ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న కొడుకును చూడటానికి వెళ్లిన 40 ఏళ్ల మహిళ తిరిగి వెలుతున్న సమయంలో సవాయ్ మాధోపూర్ జిల్లాలో కామాంధులు సామూహిక అత్యాచారం చేశారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
Coronavirus: దేశంలో 63 శాతం కరోనా కేసులకు ఢిల్లీ తబ్లీగ్ జమాత్ లింక్, దొంగ దెబ్బ, బీఎల్ఎస్!
జైపూర్ జైల్లో కొడుకు
40 ఏళ్ల మహిళ కొడుకు ఓ కేసులో పోలీసులు అరెస్టు చేసి అతన్ని జైపూర్ జైలుకు పంపించారు. జైల్లో ఉంటున్న కొడుకును చూడటానికి లాక్ డౌన్ విధించకు ముందే ఆమె జైపూర్ జైలు దగ్గరకు వెళ్లింది. అయితే కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్న సమయంలో జైపూర్ జైల్లో ఉన్న కొందరు ఖైదీలతో పాటు ఆ మహిళ కుమారుడిని వేరే జైలుకు తరలించారు.
లాక్ డౌన్ దెబ్బకు స్కూల్ లో !
జైపూర్ జైల్లో కొడుకు లేకపోవడం, వేరే జైలులో ఉన్న కొడుకును చూడటానికి అవకాశం లేకపోవడంతో ఆమె ఊరికి బయలుదేరింది. మార్గం మధ్యలో మాధోపూర్ ప్రాంతానికి వెళ్లిన సమయంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో ఆ మహిళ అయోమయానికి గురైయ్యింది. ఊరికి వెళ్లడానికి బస్సు సౌకర్యంతో పాటు ఎలాంటి వాహనాలు లేకపోవడంతో ఆమె మాధోపూర్ ప్రాంతంలో చిక్కుకుపోయింది.
పోలీసుల ముందే పంచాయితీ
ఊరికి వెళ్లడానికి ఎలాంటి బస్సులు కాని, వాహనాలు కానిలేకపోవడంతో ఆమె ఒక ఊరిలో చిక్కుకుపోయింది. ఆ సమయంలో ఆ ఊరిలో ఉన్న వారు పోలీసులను పిలిపించి ఆ మహిళ లాక్ డౌన్ పూర్తి అయ్యే వరకు ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో ఉండటానికి అవకాశం కల్పిస్తూ పంచాయితీ శారు. పోలీసుల ముందు జరిగిన పంచాయితీకి ఆ ప్రాంతం హెడ్ కానిస్టేబుల్ లాల్ చంద్ కూడా వెళ్లాడు.
కానిస్టేబుల్ కాదు కామాంధుడు
ఊరిలోని స్కూల్ లో జరిగిన పంచాయితీకి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ లాల్ చంద్ మహిళ మీద కన్నేశాడు. స్కూల్ లో ఒంటరిగా మహిళ ఉంటుందని తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ లాల్ చంద్ మరుసటి రోజు స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లాడు. తరువాత స్కూల్ లో నిస్సహాయంగా ఉంటున్న మహిళ మీద హెడ్ కానిస్టేబుల్ లాల్ చంద్ తో పాటు అతని స్నేహితులు సామూహిక అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని ఆమెను బెదిరించి అక్కడినుంచి వెళ్లిపోయారు.
క్వారంటైన్ లో మహిళ
ప్రతిరోజు హెడ్ కానిస్టేబుల్, అతని స్నేహితులు మహిళ మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించడంతో ఆమె భయపడి ఊరి ప్రజలకు విషయం చెప్పింది. ఊరి ప్రజలు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి హెడ్ కానిస్టేబుల్ లాల్ చంద్ తో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. హెడ్ కానిస్టేబుల్ లాల్ చంద్ ను పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు. మహిళకు వైద్య పరీక్షలు చేయించామని, ఆమె క్వారంటైన్ లో ఉండటానికి అవకాశం కల్పించామని, సామూహిక అత్యాచారం కేసులో పరారైన మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని సవాయ్ మాధోపూర్ జిల్లా పోలీసులు తెలిపారు.