Coronavirus: రాజమౌలి RRRకు పోటీ, CCC: Cఅంటే చైనా, Cకరోనా, Cచెన్నై, ఇల్లరికం వచ్చిన కరోనా !
చెన్నై/మదురై/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) పుట్టినిల్లు చైనాను తమిళనాడు తలపిస్తోంది. బాహుబలి రాజమౌలి RRRకు పోటీగా ఇప్పుడు తెరమీదకు CCC వచ్చింది. C అంటే చైనా, C అంటే కరోనా, C అంటే చెన్నై. C అనే ఇంగ్లీష్ అక్షరం పేరు వింటే తమిళనాడు ప్రజలు హడలిపోతున్నారు. తమిళనాడులో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. తమిళనాడులో కరోనా వైరస్ గణాంకాల ప్రకారం వైరస్ బాధితుల సంఖ్య చైనాను తలపిస్తోంది. లక్ష కరోనా కేసుల సంఖ్యకు కేవలం 1,500 సంఖ్య తక్కువగా ఉంది. తమిళనాడులో ఈ దుర్భర పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడుతాం మురుగా అంటూ తమిళనాడు ప్రజలు దేవుడి ఆశీస్సుల కోసం వేడుకుంటున్నారు. చైనాలో బయలుదేరిన కరోనా వైరస్ ప్రపంచంలోని 200 దేశాలు చుట్టేసి తమిళనాడులో మకాం వేస్తోంది. తమిళనాడు కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. తమిళనాడులో గత కొన్ని రోజుల నుంచి సగటున మూడు వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదౌతున్నాయి.
Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్
మార్చిలో ముహూర్తం
కరోనా వైరస్ ప్రపంచదేశాలను పట్టిపీడిస్తోంది. భారతదేశంలో కరోనా వైరస్ కేసులు తాండవం చేస్తోంది. తమిళనాడులో మార్చి మూడో తేదిన కరోనా పాజిటివ్ మొదటి కేసు నమోదు అయ్యింది. తమిళనాడులో మార్చి చివరిలోనే కరోనా వైరస్ అను అక్కడి ప్రభుత్వం గుర్తించింది. అప్పటి నుంచి తమిళనాడులో కరోనా వైరస్ కట్టడి కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేక కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది.
గంటకు 133, రోజుకు 3 వేలు
తమిళనాడులో ప్రతిరోజు సగటున 3 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదౌతున్నాయి. ఈ లెక్కన తమిళ ప్రజలు కరోనా వైరస్ భయంతో గంటగంటకు కరోనా వైరస్ భయంతో హడలిపోతున్నారు. తమిళనాడు మీద కరోనా వైరస్ పగపట్టిందా ? అని తమిళనాడు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే వారి ప్రశ్నలకు ఆ దేవుడే సమాధానం చెప్పాలి.
చైనా నుంచి చెన్నైకి ఇల్లరికం వచ్చిన కరోనా
కరోనా వైరస్ పుట్టింది చైనాలో అనే విషయం ప్రపంచం అంతా తెలిసిన విషయమే. చెన్నైనాలో పుట్టిన కరోనా వైరస్ చెన్నైకి ఇల్లరికం వచ్చి తిష్ట వేసినట్లు ఉందని తమిళనాడు ప్రజలు అంటున్నారు. ఇల్లరికం వచ్చిన అల్లుడు సామాన్యంగా అత్తారింటిని ఖాళీ చెయ్యడనే సామెతను కరోనా వైరస్ గుర్తు చేస్తోందని చెన్నై ప్రజలు అంటున్నారు. చెన్నైలో గురువారం ఒక్కరోజు మాత్రమే చెన్నైలో 2, 027 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చెన్నై సిటీని కోయంబేడు మార్కెట్ నిలువునా ముంచేసింది.
ఏం చెయ్యాలి దేవుడా !
చెన్నై సిటీలో ఇప్పటి వరకు 62, 598 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చైనాలోని కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో తమిళనాడు పోటీ పడటంతో తమిళ తంబీలు హడలిపోతున్నారు. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో కరోనా కట్టడికి అక్కడి కార్పోరేషన్ అధికారులు, తమిళనాడు ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మురుగా ఏమిటీ మాకు ఈ ఖర్మ
తమిళనాడులో గురువారం రాత్రి వరకు 98, 392 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. గురువారం ఒక్కరోజు మాత్రమే తమిళనాడులో 4, 343 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి.. తమిళనాడులో గురువారం ఒక్కరోజు మాత్రమే 57 మంది మరణించారు. తమిళనాడులో కరోనా వైరస్ చికిత్స విఫలమై గురువారం నాటికి 1, 321 మంది మరణించారని స్వయంగా తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.
మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా
తమిళనాడులో ఇప్పటికే కరోనా వైరస్ వ్యాధితో డీఎంకే పార్టీ ఎమ్మెల్యే అన్బళగన్ మరణించారు. డీఎంకే పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకి వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలింది. గురువారం మరో ఇద్దరు తమిళనాడు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. తమిళనాడులోని ఉళుందూర్ పేటై ఎమ్మెల్యే, పరమకుడి ఎమ్మెల్యేకి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఇద్దరికి కరోనా పాజిటివ్ అని నిర్దారించారు. ఇప్పటి వరకు తమిళనాడులో ఏడు మంది ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. వరుసగా ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూడటంతో తమిళనాడులో ని ప్రజాప్రతినిధులు హడలిపోతున్నారు.