శ్రీహరికోటలో పీఎస్ఎల్వీ సీ50 కౌంట్డౌన్ షురూ: నేడే నింగిలోకి
శ్రీహరికోట: భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ50 వాహన నౌకను పంపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్డౌన్ ప్రక్రియ బుధవారం మధ్యాహ్నం 2.41గంటలకు ప్రారంభమైంది.
ఈ కౌంట్డౌన్ నిరంతరాయంగా 25 గంటలపాటు కొనసాగనుంది. కౌంట్డౌన్ ముగిసిన వెంటనే గురువారం సాయంత్రం 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సీ50 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. దీని ద్వారా మనదేశానికి చెందిన సీఎంఎస్-01 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
సీఎంఎస్-01 మనదేశానికి చెందిన 42వ కమ్యూనికేషణ్ ఉపగ్రహం కావడం గమనార్హం. దీని బరువు 1410 కిలోలు. ఈ ప్రయోగంతో ఇంటర్నెట్ సేవలు మరింత మెరుగవనున్నాయి.
Recommended Video
ఎస్డీఎస్సీ నుంచి ప్రయోగిస్తున్న పీఎస్ఎల్వీ 77వ లాంచ్ వెహికిల్ మిషన్. వాహన వివిధ దశల్లో ఇంధనాన్ని నింపే ఆపరేషన్ కొనసాగుతోందని షార్ అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం 3.10 గంటల నుంచి ఈ ప్రయోగాన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.