వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: చెట్టుకు వేలాడుతూ దంపతుల శవాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

సీతాపూర్: ఆ దంపతులు సాయంత్రం మార్కెట్‌కు వెళ్లారు. తెల్లారి చెట్టుకు వేలాడుతూ శవాలైన కనిపించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఖైరాబాద్ ప్రాంతంలోని ముసేరిపూర్ గ్రామంలో దంపతుల శవాలు చెట్టుకు వేలాడుతూ కనిపించాయని పోలీసులు మంగళవారంనాడు తెలిపారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - శంభు (40), అతని భార్య కమల (35) సోమవారం సాయంత్రం కాస్రేలా మార్కెట్‌కు వెళ్లారు. ఆ తర్వాత గ్రామం వెలుపల గల చెట్టుకు వారిద్దరి శవాలు వేలాడుతూ కనిపించాయి.

Couple found hanging from tree in UP

ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు గత రాత్రి అందింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వారిని హత్య చేసి ఉంటారని దంపతుల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇరువురి మధ్య తలెత్తిన వివాదం దానికి కారణం కావచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

English summary
The bodies of a couple were found hanging from a tree here at Muserypur village in the Khairabad area, police said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X