భార్య, భర్త మధ్యలో ఇంకొకడు.. రక్తపుమడుగులో దంపతులు... అనాధగా మారిన చిన్నారి....
గురుగ్రామ్ : ఏం జరిగిందో తెలియదు, ఇంట్లోకి వచ్చిన అతిథి ప్రమేయం ఉందో క్లారిటీ లేదు. కానీ ఆ దంపుతుల రక్తపుమడుగులో పడి ఉన్నారు. అరుపులతో కింద ఉన్న యజమాని పైకి వచ్చి చూసి హతాశుడయ్యాడు. వారిని బతికించుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ దంపతులు చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. గురుగ్రామ్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
నాలుగుతరాలు బలవన్మరణం.. ముత్తాత నుంచి ముని మనవడు వరకు... ఇదీ బర్నాలా కుటుంబం విషాదగాధ
ఉత్తర్ప్రదేశ్కు చెందిన విక్రమ్, జ్యోతికి కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వారికి ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే పొట్ట చేత పట్టుకొని వారు ఆరేళ్ల క్రితం గురుగ్రామ్ వచ్చారు. గురుగ్రామ్ ఉద్యోగ విహర్లో గల ఫ్లాట్ రెండో అంతస్తులో ఉంటున్నారు. అయితే ఇటీవల వారికి ఇంటికి ఓ అతిథి కూడా వచ్చాడు. ఏం జరిగిందో తెలయరాలేదు. కానీ ఇవాళ ఉదయం భార్య భర్తల అరుపులు వినిపించాయి. ఏం జరిగిందా అని కింద ఉన్న యాజమాని వచ్చి చూశాడు. అయితే భార్య భర్తలపై దాడి జరిగింది. వారిద్దరూ రక్తపుమడుగులో పడి ఉన్నారు. వెంటనే తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లాడు. వారిని కాపాడేందుకు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. వారిద్దరూ చనిపోయారని వైద్యులు ధ్రువీకరించారు. దీంతో వారిని మృతదేహాలను ఇంటికి తీసుకొచ్చారు.
వీరిపై దాడి జరిగిన సమయంలో వారి కుమారుడు ఉన్నడా లేడా అనే అంశంపై క్లారిటీ రాలేదు. వీరిపై దాడి జరిగిన సమయంలో ఉన్న బంధువును పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దంపతుల హత్యకు కారణం తెలియరాలేదని .. విచారణ జరుగుతుందని ఉద్యోగ్ విహర్ పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.