భారత్లో కరోనా: తొలిరోజు గుడ్న్యూస్ -1కోటి రికవరీలు-కొత్తగా 19,079 కేసులు, 224మరణాలు-వ్యాక్సిన్ డ్రైరన్ షురూ
కరోనా మహమ్మారి విలయానికి సంబంధించి కొత్త ఏడాది తొలిరోజే భారత్కు రెండు గుడ్ న్యూస్లు వచ్చాయి. దేశంలో అత్యవసర వినియోగానికి సీరం-ఆక్స్ ఫర్డ్ అభివృద్ధి చేసిన 'కొవిషీల్డ్' వ్యాక్సిన్కు కేంద్ర నిపుణుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తొలి రోజు పెరిగిన రికవరీలతో దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 1కోటికి చేరువైంది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ శనివారం విజయవంతంగా ప్రారంభమైంది..
సెక్సీ ఫొటోలతో హారిక వలపువల -డేటింగ్ పేరుతో భారీ చీటింగ్ -భర్త సిక్ - కుటుంబ పోషణకు పక్కదారి
96.12శాతం రికవరీ రేటుతో..
దేశంలో
రోజురోజుకు
కరోనా
వైరస్
నుంచి
కోలుకునే
వారి
సంఖ్య
పెరుగుతోంది.
రికవరీలు
ఇప్పటికే
99
లక్షల
మార్కును
దాటి..కోటి
దిశగా
పయనిస్తున్నాయి.
వరసగా
36వ
రోజు
కూడా
రోజూవారీ
పాజిటివ్
కేసులకంటే..
రికవరీ
కేసులే
ఎక్కువగా
ఉన్నాయి.
కేంద్ర
ఆరోగ్య
శాఖ
శనివారం
విడుదల
చేసిన
బులిటెన్
ప్రకారం..
నిన్న(శుక్రవారం)
ఒక్కరోజే
22,926
మంది
కొవిడ్
వ్యాధి
నుంచి
కోలుకున్నారు.
దీంతో
మొత్తం
రికవరీల
సంఖ్య
కోటికి
చేరువగా,
99,06,387కు
పెరిగింది.
దేశంలో
రికవరీ
రేటు
96.12శాతంగా
ఉన్నట్లు
కేంద్రం
పేర్కొంది.
ఇక..
కన్నకూతురిని రేప్ చేయించిన తల్లి -ప్రియుడి మోజు తీర్చడానికి బిడ్డను పణంగా -బాలికకు గర్భం రావడంతో
కొత్తగా 19,079 కేసులు..
కరోనా
తగ్గుతుందన్న
ఆశతో
కొత్త
ఏడాదిలోకి
అడుగుపెట్టిన
దేశంలో
తొలి
రోజున
కొత్త
కేసుల
సంఖ్య
20
వేలకు
దిగువన
ఉండటం
గమనార్హం.
ఆరోగ్య
శాఖ
చెప్పిన
వివరాల
ప్రకారం..
గడిచిన
24
గంటల్లో
మొత్తం
8,29,964
మందికి
కొవిడ్
నిర్ధారణ
పరీక్షలు
నిర్వహించగా..
19,079
మంది
పాజిటివ్
గా
తేలారు.
తద్వారా
దేశంలో
మొత్తం
కేసుల
సంఖ్య
1,03,05,788కు
పెరిగింది.
గడిచిన
24
గంటల్లో
224
మంది
ప్రాణాలు
కోల్పోగా,
మొత్తం
మృతుల
సంఖ్య
1,49,218కి
పెరిగింది.
రికవరీలు
ఒక
కోటికి
చేరువకాగా,
ప్రస్తుతం
యాక్టివ్
కేసుల
సంఖ్య
2,50,183గా
ఉంది.
దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ షురూ..
కరోనా
మహమ్మారిని
నిరోధించే
వ్యాక్సిన్
పంపిణీ
కార్యక్రమానికి
దేశంలో
ముందడుగు
పడిన
వేళ
శనివారం
టీకా
డ్రైరన్
చేపట్టారు.
దేశవ్యాప్తంగా
116
జిల్లాల్లోని
259
ప్రదేశాల్లో
వ్యాక్సినేషన్
మాక్
డ్రిల్
శనివారం
ఉదయం
ప్రారంభమైంది.
టీకా
పంపిణీ
కోసం
ఏర్పాటు
చేసిన
అన్ని
వ్యవస్థల
పనితీరును
ఈ
డ్రైరన్లో
అధికారులు
విస్తృతంగా
పరిశీలిస్తున్నారు.
ఢిల్లీలోని
జీటీబీ
ఆసుపత్రిలో
ఏర్పాటు
చేసిన
వ్యాక్సిన్
మాక్
డ్రిల్
కార్యక్రమాన్ని
కేంద్ర
ఆరోగ్యమంత్రి
హర్షవర్ధన్
స్వయంగా
వెళ్లి
పరిశీలించారు.