Hospital: కోవిడ్ పాజిటివ్, ఆంటీని రేప్ చేసిన నర్సు, 24 గంటల్లో మృతి, సీక్రెట్ గా మొత్తం చెప్పి !
భోపాల్/ చెన్నై: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి నుంచి మా ప్రాణాలు కాపాడు దేవుడా అంటూ కోరుకోని ప్రజలు ఎవరైనా ఉన్నారంటే లేరు అని టక్కున మనం ఒక్కరి పేరు కూడా చెప్పే పరిస్థితిలో లేము. కరోనా పాజిటివ్ తో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన మహిళ ఆమె ప్రాణాలు కాపాడాలని అక్కడి వైద్యులకు చేతులు ఎత్తి దండం పెట్టింది. తల్లి వయసు ఉన్న ఆ మహిళ మీద ఓ కామాంధుడు కన్ను వేశాడు. కోవిడ్ పాజిటివ్ తో ఆమె చికిత్స పొందుతున్నదని అదే ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేసే మేల్ నర్సుకు తెలిసింది. పీకలదాక మద్యం సేవించిన ఆ మేల్ నర్సు ఆంటీ అందంగా ఉందని, కోవిడ్ నన్ను ఏమీ చెయ్యేదని ఆమె మీద అత్యాచారం చేసి కామం తీర్చుకున్నాడు. ఆసుపత్రి ఉద్యోగి అయిన మేల్ నర్సు రేప్ చెయ్యడంతో ఆమె షాక్ కు గురైయ్యింది. వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న సమయంలో పోలీసులకు, అక్కడి డాక్టర్లకు జరిగిన విషయం మొత్తం, సీక్రెట్ గా చెప్పిన ఆమహిళ అత్యాచారం జరిగిన 24 గంటల్లోపే ప్రాణాలు వదలడం కలకలం రేపింది.
Wife swapping: వదిన నాకు, బావ నీకు, భార్య రివర్స్ తో భర్తకు ? విదేశాల నుంచి వచ్చి, ఫినిష్ !
అందమైన మహిళకు కరోనా పాజిటివ్
మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన 43 ఏళ్ల మహిళ అనారోగ్యానికి గురైయ్యింది. అనారోగ్యానికి గురైన ఆమెను ఏప్రిల్ 6వ తేదీన భోపాల్ ప్రభుత్వ మెమోరియల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె అక్కడే చికిత్స పొందుతున్నది. చూడటానికి ఎర్రగా, లావుగా, పొడవుగా ఉన్న ఆ మహిళకు వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది.
కామాంధుడి కన్ను పడింది
భోపాల్ మెమోరియల్ ఆసుపత్రిలో సంతోష్ అహిర్వాల్ (24) అనే యువకుడు మేల్ నర్సుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె ఆసుపత్రిలో చేరిప్పటి నుంచి సంతోష్ ఆమె మీద కన్ను వేశాడు. మహిళకు కరోనా పాజిటివ్ అని తెలిసినా సంతోష్ ఆమెతో రాసుకునిపూసుకుని తిరగడం మొదలుపెట్టాడు. చికిత్స అందించే నెపంలో, మందులు, మాత్రలు ఇచ్చే నెపంతో ఆమెను లైంగికవేధింపులకు గురి చేశాడు.
రేప్ చేస్తే షాక్ అయిన మహిళ
రాత్రి మహిళను ఆమె కుటుంబ సభ్యులు ఫోన్ లో మాట్లాడించి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. రాత్రి డ్యూటీ డాక్టర్లు కూడా వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న మేల్ నర్సు సంతోష్ మహిళ ఉంటున్న రూమ్ లోకి వెళ్లాడు. మహిళ నోట్లో గుడ్డలు కుక్కిన కామాంధుడు ఆమె మీద అత్యాచారం చేశాడు.
తల్లి వయసు ఉంది వదలేయ్ అంటే ?
మహిళ మీద అత్యాచారం చేసే సమయంలో ఆమె నాకు నీ తల్లి వయసు ఉంది, నన్ను వదిలేయ్ అని ప్రాదేయపడిందని తెలిసింది. ఆంటీ సహకరించు, కరోనా నన్ను, నిన్ను ఏమీ చెయ్యలేదు అన్ని రెచ్చిపోయాడు. ఆంటీ ఈ విషయం నువ్వు ఎవ్వరికి చెప్పద్దు, నేను ఎవ్వరికి చెప్పను అంటూ మద్యం మత్తులో ఉన్న సంతోష్ ఆమె మీద అత్యాచారం చేసి అతని కామం తీర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
షాక్ తో ఆంటీ ప్రాణం పోయింది
ఆసుపత్రి ఉద్యోగి రేప్ చెయ్యడంతో ఆమె షాక్ కు గురి కావడంతో పరిస్థితి విషమించింది. వెంటనే ఆమెను వెంటిలేటర్ మీద చికిత్స చేశారు. వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న సమయంలో బాధితురాలు తన మీద మేల్ నర్సు సంతోష్ అత్యాచారం చేశాడని డ్యూటీ డాక్టర్లకు చెప్పింది. విషయం తెలుసుకున్న భోపాల్ పోలీసు అధికారులు ఆసుపత్రి చేరుకుని బాధితురాలి దగ్గర స్టేట్ మెంట్ తీసుకున్నారు. అత్యాచారం జరిగిన తరువాత వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న ఆమె 24 గంటల్లోపే షాక్ తో ప్రాణాలు వదిలేసిందని వైద్యులు తెలిపారు.
గతంలో మేల్ నర్సు సస్పెండ్
గతంలో డ్యూటీలో మద్యం సేవించిన మేల్ నర్సు సంతోష్ ను సస్పెండ్ చేశారని, ఇటీవలే మళ్లీ అతను విధులకు హాజరైనాడని కేసు విచారణ చేస్తున్న సీనియర్ భోపాల్ లోని నిషాత్పూర్ పోలీస్ స్టేషన్ అధికారి ఇర్షాద్ ఆలీ స్థానిక మీడియాకు చెప్పారు. తన పేరు మాత్రం బయటపెట్టకూడదని బాధితురాలు చెప్పిందని పోలీసులు అన్నారని ఎన్ డీ టీవీ న్యూస్ తెలిపింది. కామాంధుడు సంతోష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
Recommended Video
భోపాల్ గ్యాస్ ప్రమాదం బాధితురాలు
కోవిడ్ పాజిటివ్ తో చికిత్స పొందుతూ మరణించిన మహిళ 1984లో భోపాల్ లో జరిగిన గ్యాస్ ప్రమాదంలో ప్రాణాలతో భయటపడిందని, ఇప్పుడు కరోనాను జయించాలని ప్రయత్నించి అత్యాచారానికి గురై ప్రాణాలు వదిలిందని పోలీసు అధికారులు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన మహిళను అత్యాచారం చేసిన కామాంధుడు సంతోష్ కు వైద్యపరీక్షలు చేయించామని పోలీసు అధికారులు అన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురై ప్రాణాలు వదలడం మధ్యప్రదేశ్ లో కలకలం రేపింది.