జేఈఈ అడ్వాన్స్ క్లియర్ చేయలేదు.. అయినా ఐఐటీ బాంబేలో ఎంటర్ అయింది. ఇంతకీ ఎవరో తెలుసా? (వీడియో)
ముంబై : ఐఐటీ బాంబే. అడుగుపెట్టాలంటే ఎంతో కష్టపడాలి. రాత్రి పగలన్న తేడాలేకుండా చదవితే గానీ ఆ ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టడం సాధ్యం కాదు. అయితే అంత కష్టపడకుండానే జేఈఈ అడ్వాన్స్ కూడా క్లియర్ చేయకపోయినా దర్జాగా క్యాంపస్లో అడుగుపెట్టింది. దర్జా ఒలకబోస్తూ క్లాస్ రూంలో తిరిగింది. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? ప్రొఫెసర్తో పాటు స్టూడెంట్స్ను షాకిచ్చింది ఓ ఆవు.
Cow entering IIT BOMBAY without clearing JEE Advanced?? 🐄🐄🐄. A cow entering an IIT Bombay classroom 😂 pic.twitter.com/i7taJ2TPOd
— Mayur Borkar (@imayurborkar) July 29, 2019
శనివారం ఉదయం ఐఐటీ బాంబేలో సీరియస్గా క్లాస్ జరుగుతోంది. ప్రొఫెసర్ చెబుతున్న క్లాస్ను విద్యార్థులు బుద్దిగా వింటున్నారు. ఇంతలో క్లాస్ రూం తలుపు వద్ద అలికిడైంది. గదిలో ఉన్న వారంతా అటువైపు చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఇంతలో తరగతి గదిలోకి వచ్చిన ఓ ఆవు దర్జాగా రూమంతా తిరింది. ఆవు క్లాస్రూంలోకి రావడంతో స్టూడెంట్స్ ఆ ఆవును వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ మారింది.
క్లాస్ రూంలోకి ఆవు వచ్చిన వీడియో ఐఐటీ బాంబే అధికారుల దృష్టికి రావడంతో వారు విచారణకు ఆదేశించారు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందన్న విషయం స్పష్టంగా తెలియడం లేదని చెప్పారు. ఇదిలా ఉంటే భారీగా వర్షం పడుతుండటంతో దాన్నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఆవు లెక్చర్ హాల్లోకి వచ్చిందని స్టూడెంట్స్ అంటున్నారు. కొన్ని వారాల క్రితం బాంబే ఐఐటీ క్యాంపస్లో ఓ ఇంటర్న్ను ఎద్దులు పొడిచిన ఘటన మరవకముందే ఆవు క్లాస్ రూంలోకి రావడం విద్యార్థులతో పాటు టీచింగ్ సిబ్బందిని ఆందోళనకు గురి చేస్తోంది.