వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపీఎల్ హైటెక్ క్రికెట్ బెట్టింగ్: ఐదుగురి అరెస్టు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదు మందిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. చెన్నమ్మనే అచ్చుకట్ట పోలీస్ స్టేషన్ సమీపంలోని ఇట్టుమడు 19వ క్రాస్ లోని ఇంటిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సీసీబీ పోలీసులకు సమాచారం అందింది.

ఇంటి మీద దాడి చేసి మంజునాథ్, నవీన్, జే.కే. రావ్, మల్లేష్, అశోక్ అనే నిందితులను అరెస్టు చేశామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి అన్నారు. నిందితుల నుండి రూ. 7 లక్షలు, 19 మొబైల్ ఫోన్ లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు.

మైసూరు నగరంలోని రంగ అనే బుక్కితో కలిసి వీరు ఆన్ లైన్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. ప్రపంచ కప్ మొదలైనప్పటి నుండి బెంగళూరు నగరంలో బెట్టింగ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారని ఎం.ఎన్. రెడ్డి చెప్పారు.

cricket betting racket in bangalore,arrested five persons

ఇప్పటి వరకు 16 బెట్టింగ్ కేంద్రాలపై దాడి చేసి బెట్టింగ్ నిర్వహిస్తున్న 35 మందిని అరెస్టు చేసి రూ. 55 లక్షలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అరెస్టు అయిన బుక్కీలు వారంలోపు కోర్టులో దర్జాగా బెయిల్ తీసుకుని బయటకు వచ్చి మళ్లి బెట్టింగ్ నిర్వహిస్తున్నారని చెప్పారు. వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇంతకు ముందు అత్యాచారం చేసిన వారి మీద, లైంగిక వేధింపులు పాల్పడిన వారు, సంఘవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించిన వారి మీద మాత్రమే గూండా యాక్ట్ కింద కేసులు నమోదు చేశామని అన్నారు. అయితే క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారి మీద గూండా యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఎం.ఎన్. రెడ్డి హెచ్చరించారు.

English summary
The Central Crime Branch sleuths raided an apartment in bangalore and arrested five persons who were indulging in cricket betting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X