జడేజాకు షాక్: అతని రెస్టారెంట్లో చెడిపోయిన ఆహారపదార్థాలు!
భారత క్రికెటర్ రవీంద్ర జడేజాకు ఊహించని షాక్ తగిలింది. రాజ్కోట్లో జడేజాకు చెందిన జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్ రెస్టారెంట్లో కల్తీ ఆహారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
గుజరాత్: భారత క్రికెటర్ రవీంద్ర జడేజాకు ఊహించని షాక్ తగిలింది. రాజ్కోట్లో జడేజాకు చెందిన జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్ రెస్టారెంట్లో కల్తీ ఆహారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కస్టమర్ల ఫిర్యాదుల మేరకు ఆరోగ్యశాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించగా ఈ మేరకు వెలుగుచూసింది.
జడేజా సోదరి నయన అనిరుద్దీన్ జడేజా ఈ రెస్టారెంట్కు యజమాని వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఆమెకే నోటీసులు జారీ చేశారు అధికారులు. డిప్యూటీ ఆఫీసర్ పీపీ రాథోడ్ ఆధ్వర్యంలో తనిఖీలు జరిగాయి.
ఆహార పదార్థాలలో కృత్రిమ రంగులు వాడుతున్నట్లు నిర్ధారించామని, అలాగే చాలా కాలం నిల్వ ఉన్న బేకరీ పదార్థాలు అమ్ముతున్నట్లు గుర్తించామని తెలిపారు. జేఎఫ్ఎఫ్ తోపాటు మరికొన్ని రెస్టాంట్లలోనూ తనిఖీలు నిర్వహించామచెప్పారు. కాగా, 2012లో జడేజా ఈ రెస్టారెండ్ను ప్రారంభించగా.. గత సంవత్సం ఇది అక్రమ నిర్మాణమని అధికారులు నోటీసులు జారీ చేశారు.