Kangana: ఫైర్ బ్రాండ్ కంగనాపై క్రిమినల్ కేసు, రంగోళికి షాక్, క్వీన్ దేశద్రోహి, FIR, జైలుకు నేను రెఢీ
ముంబాయి/ న్యూఢిల్లీ/ జైపూర్: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, క్వీన్ కంగనా రనౌత్ మీద మరో దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే బాలీవుడ్ క్వీన్ కంగనా మీద కొన్ని కేసులు నమోదైనాయి. మహారాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, రైతులను కించపరిచారని కంగనాపై కేసులు నమోదైనాయి. ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించిందని కంగనా, ఆమె సోదరి రంగోళిపై ముంబాయిలో కేసు నమోదు అయ్యింది. నా మీద ఎన్ని కేసులు పెడుతారో పెట్టండి, నేను జైలుకు వెళ్లడానికి రెఢీగాఉన్నాను, అన్నింటికి తెగించి ఉన్నాను అంటూ నటి కంగనా ఆమె మీద కేసు పెట్టిన వాళ్ల మీద, కేసులు పెట్టిస్తున్న వాళ్ల మీద మండిపడుతోంది.
Boss wife: బాస్ భార్యతో లింక్, పనోడికి ప్రతిరోజూ పండగే, బెడ్ రూమ్, వాష్ రూమ్, 100 వీడియోలతో, పాపం !
ఆలీ దెబ్బతో కంగనాకు షాక్
ముంబాయికి చెందిన న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళిపై ముంబాయిలో కేసు పెట్టారు. మతపరమైన ఆరోపణలు చేస్తున్నారని, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని, సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళి ప్రజలను రెచ్చగొడుతున్నారని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ బాంద్రా కోర్టులో ఫిర్యాదు చేశారు.
FIR నమోదు చెయ్యండి
పప్పు సేనా అంటూ ట్విట్ చేసి న్యాయస్థానాన్ని కించపరిచారని న్యాయవాది ఆలీ కాశీఫ్ దేశ్ ముఖ్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఇటీవల నటి కంగనా రనౌత్ సోదరి రంగోళి చేసిన ట్విట్ లను కోర్టు ముందు సమర్పించారు. వివరాలు తెలుసుకున్న బాంద్రా మెజిస్ట్రేట్ న్యాయస్థానం బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోళిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేసి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ముంబాయి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
క్వీన్ కంగనా క్లారిటి
గతం వారం రోజుల్లోనే ముంబాయిలోని బాంద్రాలో కంగనాపై నమోదైన రెండో కేసు ఇది. ఈ విషయంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా స్పందించారు. స్వాతంత్ర పోరాటం చేసిన సమయంలో దేశభక్తులకు ఎలాంటి చేదు అనుభవాలు ఎదురైనాయో అలాంటి అనుభవాలు తనకు ఎదురౌతున్నాయని భారీ డైలాగులు వేస్తున్నారు.
జైలుకు వెళ్లడానికి నేను ‘రెఢీ'
మహారాష్ట్ర ప్రభుత్వం తనను జైలుకు పంపించాలని డిసైడ్ అయ్యిందని నటి కంగనా రనౌత్ ఆరోపించారు. సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రభోస్, ఝాన్సీ లక్ష్మీబాయ్ లాంటి వారిని నేను నిత్యం పూజిస్తాను, నేను ఎవ్వరికి భయపడను, తన మీద తనకు నమ్మకం ఉందని నటి కంగనా అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం తనను జైల్లో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తోంది, తాను త్వరలో జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నానని, ఇలాంటి బుడ్డ బెదిరింపులకు భయపడనని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెబుతూ ట్విట్ చేసింది.
కంగనా సోదరికి సమన్లు
నటి కంగనా పనిలోపనిగా ఇటీవల క్యాండిల్ మార్చ్ ( క్యాండిల్ ర్యాలీ) చేసిన వారిపై విమర్శలు చేశారు. క్యాండిల్ మార్చ్ గ్యాంగ్ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని నటి కంగనా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు క్యాండిల్ ర్యాలీ చేసి ప్రజలను మోసం చెయ్యడం కాదు. నన్ను చూడండి, మహారాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతో ధైర్యంగా పోరాటం చేస్తున్నాను, మీరు ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తారా ? అంటూ మరో ట్విట్ చేసింది. గతవారంలో ముంబాయిలోని బాంద్రా మెజిస్ట్రేట్ కోర్టులో నమోదైన కేసులో అక్టోబర్ 26, అక్టోబర్ 27వ తేదీ విచారణకు హాజరుకావాలని కంగనా సోదరి రంగోళికి సమన్లు జారీ అయ్యాయి.
కంగనాకు డ్రగ్స్ కేసు చిక్కు ?
2016లో కంగనా రనౌత్ ఇచ్చిన ఓ ఇంటర్వూ ఆధారంగా ముంబాయి పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. కంగనా రనౌత్ కు, డ్రగ్స్ కు లింక్ పెడుతూ విచారణకు ఆదేశించిన మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెకు మరన్ని కష్టాలు తెచ్చిపెట్టడానికి సిద్దం అవుతోందని, ఆమె మీద శివసేన నాయకులు కక్షకట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఆరోపణలపై ముంబాయి పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
Recommended Video
హోమ్ మంత్రి క్లారిటి
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఏమైనా డ్రగ్స్ ఉపయోగించారా ? అనే విషయంలో మాత్రమే ముంబాయి పోలీసులు విచారణ చేస్తున్నారని మహారాష్ట్ర హోమ్ శాఖా మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఇటీవల వివరణ ఇచ్చారు. మొత్తం మీద ముంబాయి పోలీసులు కంగనా రనౌత్ మీద ఎలాంటి విచారణ చేస్తారో ? అనే విషయం వేచి చూడాలి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శించిన కంగనా రనౌత్ కు చెందిన ముంబాయిలోని భవనం నేలమట్టం అయిన విషయం తెలిసిందే.