మణిపూర్ కాంగ్రెస్ లో సంక్షోభం..! 12 మంది ఎమ్మెల్యేల రాజీనామా..!!
మణిపూర్/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్కు మరోసారి షాక్ తగిలింది. మణి పూర్ లో ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వీరందరూ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. రాజీనామా చేసిన వీరు భాజపాలో చేరతారనే ఊహాగానాలు వినిపించడంతో వారిలో ఒక సీనియర్ ఎమ్మెల్యే స్పందించారు.
ఇతర ఏ రాజకీయ పార్టీలో చేరబోయే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మణిపూర్లోని రెండు స్థానాల్లో ఒక దానిని బీజేపీ గెల్చుకోగా, రెండో దానిని నాగా పీపుల్స్ ఫ్రంట్ కైవసం చేసుకుంది.దీంతో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ వీరంతా పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు వారి రాజీనామా పత్రాలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు, పీసీసీ అధ్యక్షుడు గయ్ఖంగంకు అందించారు.
అనంతరం వారిలో ఎనిమిది మంది భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దీంతో భాజపా ఎమ్మెల్యేల సంఖ్య 21 నుంచి 29 చేరింది. మేం ఇతర పార్టీలో చేరేందుకు రాజీనామా చేయలేదు. ఈ రాజీనామాల అనంతరం మా నియోజకవర్గాల్లో అట్టడుగు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం. ప్రజలకు పార్టీపై మళ్లీ నమ్మకం కలిగేలా చేస్తాం అంటూ మణిపూర్ పీసీసీ ఉపాధ్యక్షుడి పదవికి రాజీనామా చేసిన కెహెచ్ జాయ్కిషన్ సింగ్ పేర్కొన్నారు.