కొండచరియల క్రింద ఉన్న మనిషిని సిఆర్పిఎఫ్ కుక్క ఎలా గుర్తుపట్టిందో తెలుసా... వీడీయో
జమ్ము,కశ్మీర్లో కురుస్తున్న వర్షాలకు కొండచరియలకు విరిగిపడ్డాయి. దీంతో ఓ వ్యక్తి వాటి క్రింద చిక్కుకున్నాడు. పూర్తిగా మట్టిలో కప్పుకుపోయాడు. తాను అక్కడ భూమిలో పాతుకుపోయినట్టు ఎవరికి తెలియని పరిస్థితి. దీంతో ఇక ప్రాణాలు గోవిందా అనుకునే సమయంలోనే ఓ కుక్క ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. కొండ చరియలు విరిగిపడడంతో సిఆర్ఫీఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో సీఆర్పీఎఫ్ 72వ బెటాలియన్కు చెందిన ఓ కుక్క బురదలో కూరుకుపోయిన వ్యక్తిని పసిగట్టింది.
దీంతో హైవేలోని 147 మైలు రాయివద్ద బెటాలియన్కు చెందిన అజాక్సీ అనే ఓ కుక్క వ్యక్తిని పసిగట్టడడంతో సీర్పీఎఫ్ సిబ్బంది వెంటనే ఆ వ్యక్తిని చూడడంతో సజీవంగా కనిపించాడు. దీంతో జవాన్లే స్వయంగా మట్టిని తవ్వి అతన్ని బయటకు తీశారు. అనంతంర ఆసుపత్రికి తరలించారు.
#WATCH CRPF personnel of 72nd Battalion rescue a man trapped in landslide on Jammu-Srinagar highway near milestone 147. On following cue from CRPF dog, the troops found a man trapped in debris of the landslide which had occurred last night. The man has been admitted to hospital. pic.twitter.com/JFBP7agak0
— ANI (@ANI) July 31, 2019
మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్థంభించింది. వర్షాలతో వాగులు వంకలు పొంగిర్లుతున్న నేపథ్యంలోనే శ్రీనగర్ హైవే సైతం మూసి వేశారు. విపరీతమైన వర్షాల నేపథ్యంలోనే శ్రీనగర్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహానాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.