కశ్మీర్ ఎన్ కౌంటర్: ఉగ్రవాదుల కాల్పుల్లో భారత జవాన్ మృతి
కశ్మీర్: శనివారం తెల్లవారుజామున పుల్వమా ప్రాంతంలో భారత భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ ఒకరికి బలమైన బుల్లెట్ గాయమై ప్రాణాలు వదిలినట్టు సమాచారం.
భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డట్టు తెలుస్తోంది. భద్రతా దళాలు ధీటుగా ఎదురు కాల్పులు జరపడంతో.. రాళ్ల దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు చాకచక్యంగా అక్కడినుంచి పారిపోయినట్టు సమాచారం.
#UPDATE: 1 CRPF personnel, who was injured during encounter between terrorists & security forces in Pulwama, has lost his life. Taking advantage of heavy stone pelting terrorists managed to escape. Operation has concluded. #JammuAndKashmir
— ANI (@ANI) May 12, 2018
ఇదిలా ఉంటే, మధ్యకశ్మీరులోని బడ్గామ్ జిల్లా వార్ద్వాన్ వద్ద గల సైనికస్థావరంపై దాడికి శుక్రవారం ఉగ్రవాదులు విఫలయత్నం చేశారని సైనిక వర్గాలు వెల్లడించాయి. అయితే ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో సెలెక్షన్గ్రేడ్ కానిస్టేబుల్ షమీమ్ ఒకరు మరణించినట్టు సమాచారం.