పెద్ద నగదు నోట్ల రద్దు ఎఫెక్ట్ , బ్యాంకులో డబ్బులు సాధించింది, కాని, కూతురును కోల్పోయింది
బ్యాంకులో కొత్త కరెన్సీకోసం వెళ్ళిన ఓ మహిళ తన బిడ్డ ప్రాణాలను కోల్పోయింది. ఉత్తర్ ప్రదేశ్ లోని బలరామ్ పూర్ కు చెందిన అర్జునా ఖాతూన్ పెద్ద లైన్ లో నిలబడి బ్యాంకులో డబ్బులను సంపాదించింది. అయితే ఆమె ఒడి
పాట్నా :పెద్ద నగదు నోట్ల రద్దు ఓ పసిపాప ప్రాణాన్ని బలిగొంది. బ్యాంకుల వద్ద పెద్ద సంఖ్యలో ఉన్న క్యూ లైన్ ను దాటుకొని తల్లి డబ్బులను తీసుకొంది. నెలవారీ ఖర్చులకు డబ్బులను బ్యాంకు నుండి సాధించినా ,కన్న బిడ్డను కోల్పోయింది ఆమె, ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
పెద్ద నగదు నోట్ల రద్దు కారణంగా బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకొంది. బలరామ్ పూర్ కు చెందిన అర్గునా ఖాతూన్ ఇంటి అవసరాల నిమిత్తం బ్యాంకుకు వెళ్ళింది.కాని, బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున లైను ఉంది.
ఇంటి అవసరాల నిమిత్తం క్యూ లైన్ లో నిల్చుంటే తప్ప డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఎలాగోలా బ్యాంకులోకి వెళ్ళి ఆమె డబ్బులు సంపాదించింది. నెల అవసరాలకు ఇబ్బంది లేదని ఆమె భావించింది.
కాని, బ్యాంకు నుండి బయటకు వచ్చిన ఆమెకు కన్నీళ్ళు మిగిలాయి. తన ఒడిలోని పాప మరణించింది.ఆసుపత్రికి ఆమె తన పసిపాపను తీసుకెళ్ళింది. అయితే ఊపిరాడక పసిబిడ్డ చనిపోయందని వైద్యులు చెప్పారు.