అటారీ బోర్డర్ వద్ద రూ. 2700 కోట్ల హెరాయిన్ పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
కస్టమ్స్ అధికారులు అతిపెద్ద స్మగ్లింగ్ రాకెట్ను చేధించారు..పాకిస్థాన్ నుండి ఇండియాకు తరలిస్తున్న సుమారు 532 కిలోల హెరాయిన్ ను ఇండియా పాకిస్థాన్ బోర్డర్ చెక్ పాయింట్ అయిన.. అటారీ వద్ద నిఘావేసి పట్టుకున్నారు..కాగా కస్టమ్స్ చరిత్రలో అతిపెద్ద స్మగ్లింగ్ రాకెట్ గా కస్టమ్స్ కమీషనర్ దీపక్ శర్మ చెప్పారు.. కాగా హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 2700 కోట్ల రుపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఆయన చెప్పారు..
హెరాయిన్ను స్మగ్లింగ్ చేస్తున్న సూత్రదారి పాక్ ఆక్రమిత లోయ ప్రాంతానికి చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు..ఈ నేపథ్యంలోనే తారీఖ్ అహ్మాద్ అనే స్మగ్లర్ను కశ్మీర్ పోలీసుల సహాయంతో పట్టుకున్నట్టు చప్పారు. కాగా హెరాయిన్ ను దిగుమతి చేసుకునే వ్యక్తిని కూడ పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఇదే ప్రాంతంలో మరో 52కిలోల నార్కోటిక్స్ ను కూడ రెండు రోజుల క్రితం పట్టుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు... ..ఉప్పును తరలిస్తున్న వ్యానులో బస్తాల వెనుక నార్కోటిక్స్ సరఫరా చేస్తుండగా కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేసి పట్టుకున్నట్టు తెలిపారు.