వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

cyclone bulbul:భారీ వర్షాలు, ఉరుముల బీభత్సం, బెంగాల్‌లో ఒకరి మృతి

|
Google Oneindia TeluguNews

బుల్ బుల్ తుపాన్ బెంగాల్‌లో బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ రాత్రి సందర్బన్ డెల్టా నుంచి.. భారత్ బంగ్లాదేశ్ మీదుగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈదురుగాలతో భారీ వృక్షాలు నెలకొరిగాయి. తుపాన్ ప్రభావంతో ఒకరు మృతిచెందినట్టు అధికారులు పేర్కొన్నారు. తీరప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

తుపాన్ ప్రభావంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవులను మరో రెండురోజులు పొడిగిస్తున్నట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పష్టంచేశారు. ఇప్పటికే లక్ష 20 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు. తీరప్రాంతాల్లో భీతవాహ పరిస్థితి నెలకొందని ఆమె వెల్లడించారు. తుపాన్ తీవ్రత దృష్ట్యా భారత వాతావరణ విభాగం నిన్ననే ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.

cyclone bulbul:Heavy rain, thunderstorm lash Bengal, 1 dead

శని, ఆది రెండురోజులకు ఆరెంజ్ అలర్ట్ వర్తిస్తోందని అధికారులు తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్, భద్రక్, కేంద్రపరా, జగత్ సింగ్ పూర్ వద్ద భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. బెంగాల్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని.. 204 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని తెలిపారు.

English summary
Cyclone Bulbul which intensified from Severe Cyclonic Storm (SCS) to very severe cyclonic storm on Friday is expected to make landfall tonight at the Sunderban delta along the India-Bangladesh border.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X