పుదుచ్చేరికి 25 కి.మీ దూరంలో నివర్.. 120 కి.మీ వేగంతో గాలులు
నివార్ తుఫాన్ తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోంది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. 16 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదిలిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తాజా అప్ డేట్ ప్రకారం పుదుచ్చేరికి తూర్పున 25 కిలోమీటర దూరంలో కేంద్రీకృతమై ఉందని.. మరో 2 గంటల్లో తీరం దాటనుందని తెలిపారు. చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో గల ఉంది అని.. 14 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని అధికారులు తెలిపారు.
తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని నాలుగు జిల్లాలు తిరువన్నమలై, కడలూర్, కల్లకురిచ్చి, విలుప్పుం, పుదుచ్చేరిలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలతోపాటు ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని పేర్కొన్నది.
#NivarCycloneUpdate: Tamil Nadu State Disaster Mgmt Authority issues severe weather warning for the state.
— ANI (@ANI) November 25, 2020
Severe thunderstorm with heavy rain likely to occur over Thiruvannamalai, Cuddalore, Kallakurichy & Viluppuram districts of Tamil Nadu & Puducherry area within next 3 hrs. pic.twitter.com/K7pCNoUItg
Recommended Video
మరోవైపు తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో బుధవారం ఉదయం నుంచే వర్షం కురిసింది. కడలూరులో 227 మిల్లీ మీటర్లు, పుదుచ్చేరిలో 187 మిల్లీమీటర్లు, కరైకల్లో 84 మి.మీ, చెన్నై 89, నాగపట్నంలో 62 మిమీ వర్షపాతం నమోదైంది. మరో 2 గంటల్లో తుషాన్ తీరం దాటుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.