అందమైన స్త్రీలతో వివాహం: కోరిక తీర్చుకొని విక్రయం, అడ్డుకొన్న కూతురిపై యాసిడ్ దాడి
కన్నకూతురిపైనే ఓ తండ్రి యాసిడ్ దాడికి దిగాడు. అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపేవాడు. ఈ విషయమై తండ్రిపై పోలీసులకు ఫిర్యాదుచేసినందుకుగాను కన్నకూతురిపై తండ్రి యాసిడ్ పోశాడు.
లక్నో:కన్నకూతురిపైనే ఓ తండ్రి యాసిడ్ దాడికి దిగాడు. అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపేవాడు. ఈ విషయమై తండ్రిపై పోలీసులకు ఫిర్యాదుచేసినందుకుగాను కన్నకూతురిపై తండ్రి యాసిడ్ పోశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.కుష్బూ అనే వివాహితపై ఆమె తండ్రి యాసిడ్ పోసి హత్యకు పూనుకొన్నాడు.
పేదరికంలో ఉండి కూతుళ్ళకు వివాహం చేయలేని పరిస్థితుల్లో ఉండో, లేదా ఆడపిల్లే పుట్టిందనే చంపేవారిని చూశాం. కానీ, ఓ దుర్మార్గుడు అమ్మాయిలను వ్యబిచారవృత్తిలోకి దింపడమే పనిగా పెట్టుకొన్నాడు.
అయితే ఈ పని వద్దని తండ్రిని హెచ్చరించినా ఆయన వినలేదు.దీంతో తండ్రి చేస్తున్న పనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ పిర్యాదును మనసులో పెట్టుకొని కూతురిపై కక్షగట్టాడు తండ్రి
ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని బాధితురాలిని హెచ్చరించాడు తండ్రి అయితే ఈ ఫిర్యాదును వెనక్కితీసుకోవడానికి మాత్రం బాధితురాలు అంగీకరించలేదు.దీంతో ఆమెపై యాసిడ్ పోసి చంపేందుకు ప్రయత్నించాడు.
పెళ్ళి చేసుకొని అమ్మాయలను అమ్మేసేవాడు
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ళ కుష్బూదేవిపై ఆమె తండ్రి మాణిక్ చంద్ర యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో ఆమె ముఖం తీవ్రంగా కాలిపోయింది. రాత్రిపూట తలుపుకొట్టడంతో కుష్బూ వెళ్ళి తలుపుతీసింది.అయితే తలుపుతీయగానే యాసిడ్ బాటిల్ తో వచ్చిన తండ్రి తన ముఖంపై పోశాడని బాధితురాలు చెప్పారు.యాసిడ్ దాడి జరగగానే కిందపడిపోయాయని యాసిడ్ తన భర్త వినోద్ కుమార్ తో పాటు తన మూడేళ్ళకూతురిపై కూడ పడిందని బాధితురాలు చెప్పారు.
పెళ్ళి చేసుకొన్ని అమ్మాయిలను అమ్మేసేవాడు
అందమైన అమ్మాయిలను పెళ్ళిచేసుకొనేవాడు. కొంతకాలానికి వారిని ఎక్కువరేటుకు అమ్మేసేవాడు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తన తల్లి ఆయన్ను వదిలేసి వెళ్ళిపోయిందని కుష్బూ చెప్పారు.అయితే తనతో పాటు మరో ముగ్గురు చెల్లెల్లె తండ్రితోపాటే ఉండిపోయినట్టు చెప్పారు.అయితే తమ తల్లి తమ బాగోగుల గురించి ఆరా తీసేదని ఆమె వివరించారు.ఇంటికి కొత్త అమ్మాయిని తీసుకొచ్చి ఏదో కొత్త కథ చెప్పేవాడని కుష్బూ వివరించారు.
.వినోద్ కుమార్ ను నన్ను అమ్మేశాడు
తనకు 12 ఏళ్ళ వయస్సున్న సమయంలో తనను ఇటుకబట్టీల వద్ద పనికి కుదిర్చాడని కుష్బూ చెప్పారు.అయితే నాన్న చేసే పనుల గురించి గ్రామస్థులకు తెలుసు. ఆమ్మాయిలను తీసుకువచ్చి వయస్సుమీరిన ఆస్తిపరులకు అమ్మేసేవాడని వారు తనకు చెప్పినట్టు కుష్బు చెప్పారు. తనతో పాటు తన ముగ్తురు చెల్లెళ్ళను కూడ విక్రయిస్తారని చెప్పారు.ఇంట్లో నుండి పారిపోవాలని సలహా ఇచ్చారు.అయితే స్థానికంగా ఫ్లంబర్ గా పనిచేసే వినోద్ కుమార్ తనను తండ్రి అమ్మేశాడని కుష్బూ చెప్పారు.అయితే తన తల్లి వినోద్ కుమార్ గురించి ఆరా తీసింది.అతడినే పెళ్ళిచేసుకోమని సలహాఇచ్చిందని ఆ సలహాతోనే తాను వినోద్ కుమార్ ను పెళ్ళిచేసుకొన్నట్టు ఆమె చెప్పారు.
మా చెల్లెలును 50 ఏళ్ళ వ్యక్తికి అమ్మేందుకు ప్రయత్నించాడు
తన 16 ఏళ్ళ చెల్లెలును 50 ఏళ్ళ వ్యక్తికి అమ్మేయడానికి ప్రయత్నించినట్టు కుష్బూ చెప్పారు.అయితే తనతో పాటు తన తల్లి సాస్నీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేసినట్టు చెప్పారు.ఆ తర్వాత మా చెల్లెని ఓ 35 ఏళ్ళ యువకుడికి అమ్మేశాడని చెప్పారు.అయితే తన తండ్రి అకృత్యాల గురించి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి పిర్యాదు చేసినట్టు చెప్పారు.బెయిల్ పై బయటకు వచ్చిన మాణిక్ చంద్ర పిటిషన్ ను వెనక్కు తీసుకోవాలని బెదిరించాడని ఆమె చెప్పారు.అందుకు నిరాకరించడంతో తనపై యాసిడ్ దాడికి దిగినట్టు బాధితురాలు చెప్పారు.
నన్ను చంపేస్తాడు
తన తండ్రి చేస్తున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తానని కుష్బూ చెప్పారు.అయితే తాను ఈ పోరాటం చేస్తున్నందుకుగాను తనను చంపేందుకు తండ్రి ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదని ఆమె చెప్పారు.కిరాయిహంతకులను పెట్టి హత్య చేసే అవకాశాలు లేకపోలేదన్నారామె.అయితే తన తండ్రి జీవితాంతం జైల్లోనే ఉండాలని ఆమె కోరుకొంటోంది.చచ్చిపోయినా ఫర్వాలేదంటోంది.