ఆపరేషన్ కమల: బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు !
మంగళూరు: హిందూ మహాసభ నిర్వహించడంతో మహాత్మ గాంధీజీని అవమానించడమే అని కర్ణాటక మంత్రి యూటీ. ఖాదర్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కేవలం మహాత్మ గాంధీ జపం చేస్తున్నారని యూటీ. ఖాదర్ ఆరోపించారు. గాంధీజీ అంటే బీజేపీ నాయకులకు గౌరవం లేదని యూటీ. ఖాదర్ ఆరోపించారు.
మంగళూరులో మంత్రి యూటీ. ఖాదర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకుల మీద విరుచుకుపడ్డారు. గాంధీజీని హిందూ మహాసభకు చెందిన వారే హత్య చేశారని మంత్రి యూటీ. ఖాదర్ ఆరోపించారు. దోశద్రోహులను వెంటనే అరెస్టు చెయ్యాలని మంత్రి యూటీ. ఖాదర్ డిమాండ్ చేశారు.
ఆపరేషన్ కమల విషయంలో మంత్రి యూటీ. ఖాదర్ స్పంధించారు. గత కొన్ని నెలల నుంచి బీజేపీ నాయకులు ఆపరేషన్ కమల అంటూ తిరుగుతున్నారని, సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని యూటీ. ఖాదర్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నాయకుల ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని మంత్రి యూటీ. ఖాదర్ అన్నారు.
కర్ణాటకలో ఐదు సంవత్సరాలు సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంటుదని మంత్రి యూటీ. ఖాదర్ ధీమా వ్యక్తం చేశారు. కొంత కాలంగా మాయం అయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని, సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి యూటీ. ఖాదర్ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని, ఆ ఎమ్మెల్యేలు పేర్లు మాత్రం ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదని మంత్రి యూటీ ఖాదర్ అన్నారు.