సుప్రీం కోర్టు తీర్పు: ఏప్రిల్ 2న దళిత సంఘాల భారత్ బంద్
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో దళిత సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో పబ్లిక్ సర్వెంట్లను వెంటనే అరెస్టు చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం నిషేధించింది.
అపాయింటింగ్ అథారిటి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిని కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేసేందుకు సన్నద్ధమయింది.
మరోవైపు, సుప్రీం నిర్ణయంపై దళిత సంఘాలు కొన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయు. సుప్రీం నిర్ణయం ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రతిబందంకంగా మారుతుందని చెబుతున్నారు.
ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం కోర్టు తీర్పు: రివ్యూ పిటిషన్ వేయనున్న కేంద్రం
ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను యథాతథంగా ఉంచాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనకు దళిత సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన భారత్ బందుకు పిలుపునిచ్చాయి.
అట్రాసిటీ కేసులపై పూర్తి విచారణ చేసిన అనంతరే కేసులు నమోదు చేస్తే దోషులు సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని దళిత సంఘాల నేతలు అంటున్నారు.