కాంచీపురంలో గ్యాంగ్రేప్? యువతి మిస్పింగ్, శవమై తేలి, దారుణంగా కత్తిపోట్లు
చెన్నై: ఉద్యోగానికి వెళ్లి వారం రోజుల క్రితం మాయం అయిన దళిత యువతి రోజా (20) కత్తిపోట్లకు గురై, కాలిన గాయాలతో రాజకీయ నాయకుడి ఫాం హౌస్ లో శవమై కనిపించిన ఘటన తమిళనాడులోని కాంచీపురం నగరం సమీపంలో జరిగింది. దళిత యువతి అనుమానాస్పద మృతి కేసు విచారణ చేస్తున్న పోలీసులు యువతి ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రియుడే తన స్నేహితులతో కలిసి తమ కుమార్తె మీద సామూహిక అత్యాచారం చేయించి హత్య చేసి ఉంటాడని మృతిరాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని, కేసు అనేక కోణాల్లో విచారణ చేస్తున్నామని కాంచీపురం పోలీసులు తెలిపారు.
హనీట్రాప్ లో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, రూ. 50 కోట్లకు డీల్, బ్లాక్ మెయిల్,వైరల్ వీడియోలు !
కంపెనీలో ఉద్యోగం
కాంచీపురం సమీపంలోని వాలాజాబాద్ దగ్గర ఉన్న సిరువల్లూరు గ్రామానికి చెందిన బి. రోజా (20) అనే యువతి కాంచీపురంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఈనెల 21వ తేదిన ఉద్యోగానికి వెలుతున్నా అంటూ బయటకు వెళ్లిన రోజా తరువాత ఇంటికి తిరిగిరాలేదు. రోజా కోసం ఆమె కుటుంబ సభ్యులు కాంచీపురంలో, బంధువుల ఇళ్లలో, స్నేహితుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో ఈనెల 23వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రాజకీయ నాయకుడి ఫాం హౌస్
సిరువల్లూరు గ్రామానికి చెందిన రోజా సొంత ఊరుకు రెండు కిలోమీటర్ల దూరంలోని వాలాజాబాద్ లోని ఓ ఫాం హౌస్ లో చెట్టుకు వేలాడుతూ ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించింది. రోజా శవమై కనిపించిన ఫాం హౌస్ ప్రముఖ రాజకీయ నాయకుడికి చెందినదని వెలుగు చూసింది.
కత్తిపోట్లు, కాలిన గాయాలు
రోజా శవమై కనిపించిన విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రోజా మృతదేహం మీద కత్తిపోట్లు ఉన్నాయని, శరీరం మీద కాలిన గాయాలు ఉన్నాయని పోలీసులు అన్నారు. రోజా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రియుడితో చివరి సారిగా ?
సిరువల్లూరు గ్రామానికి పొరుగున ఉన్న కారై గ్రామానికి చెందిన రాజేష్ (30) అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోజా కనిపించకుండా పోయిన రోజు (ఈనెల 21) చివరిసారిగా రాజేష్ ను ఆమె కలిసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. రాజేష్ కు ఇంతకు ముందే పెళ్లి అయ్యిందని, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు అన్నారు.
వేడుకున్న రోజా తల్లిదండ్రులు
రోజా కనింపించుకుండా పోయిన రోజే ఆమె కుటుంబ సభ్యులు రాజేష్ ను కలిశారు. మా కుమార్తె ఎక్కడా ఉన్నా తిరిగి ఇంటికి పంపించాలని, నిన్ను ఏమి అనమని రోజా కుటుంబ సభ్యులు రాజేష్ ను వేడుకున్నారని వెలుగు చూసింది. అయితే తన దగ్గరకు వచ్చి రోజా మాట్లాడిందని, తరువాత నడిచి గ్రామానికి బయలుదేరిందని, తరువాత తనకు ఏమీ తెలీదని రాజేష్ అంటున్నాడని పోలీసులు అన్నారు.
గ్యాంగ్ రేప్ చేసి హత్య ?
రాజేష్, అతని స్నేహితులు తమ కుమార్తె మీద సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని, ఆత్మహత్యగా చిత్రీకరించడానికి చెట్టుకువేలాడదీశారని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని రోజా కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని పోలీసులు అన్నారు. ఇప్పటికే రోజు హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ తో పాటు కిడ్నాప్, హత్య కేసు నమోదులు చేశామని, అవసరమైతే సెక్షలు మార్చి దర్యాప్తు చేస్తామని, రాజేష్ ను, అతని స్నేహితులను విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. దళిత అమ్మాయి రోజాను దారుణంగా హత్య చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంచీపురంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.