ప్రియుడని నమ్మి వెళితే.. ఫ్రెండ్స్తో గ్యాంగ్రేప్
బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మిస్డ్కాల్తో పరిచయమైన 22 ఏళ్ల యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించిన ఓ యువకుడు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. చిక్కబళ్లాపుర నగరంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలిది తుమకూరు. చిక్కబళ్లాపురకు చెందిన గిరీష్ శుక్రవారం ఈ యువతిని నగరానికి రప్పించాడు. ప్రేమించిన వ్యక్తి కావడంతో అతడ్ని నమ్మి వచ్చేసింది యువతి.
కాగా, గిరీష్.. అతడి మిత్రులైన ఆటోడ్రైవర్లు శశిధర్, శివ్ కుమార్, రమేష్బాబు ఆమెను ఓ గదిలో బంధించి మూడ్రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకొని బాధితురాలు మంగళవారం నగర పోలీసులను ఆశ్రయించారు.
బాధితురాలు ఇచ్చిన సమాచారంతో బుధవారం ఆ నలుగురు కామాంధులనూ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.