దళితుడిని నగ్నంగా చేసి దాడి, ఊరేగింపు, వీడియో తీసి సోషల్ మీడియాలో, వైరల్!
బెంగళూరు: కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలో దళితుడిని నగ్నంగా తయారు చేసి దాడి చేస్తూ గ్రామం మొత్తం ఊరేంగిచిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దళితుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరిని అరెస్టు చేశామని, పరారైన నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం మేరకు చామరాజగర్ జిల్లా గుండ్లుపేట తాలుకా కచ్చేకట్టె గ్రామానికి చెందిన దళితుడు ప్రతాప్ ను జూన్ 3వ తేదీ నగ్నంగా తయారు చేసి గ్రామం మొత్తం ఊరిగిస్తూ అతని మీద దాడి చేశారు. ఆ సందర్బంలో కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడంతో వైరల్ అయ్యింది.
చామరాజనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దళితుడు ప్రతాప్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరిని అరెస్టు చేశారు. నలుగురు యువకులు పరారైనారు. ప్రతాప్ చాల కాలం నుంచి మానసిక అస్వస్తతకు గురైనాడని గ్రామస్తులు అంటున్నారు.
ప్రతాప్ కు వైద్య కిచిత్స చేపిన పత్రాలను అతని తండ్రి పోలీసులకు ఇచ్చాడని జిల్లా ఎస్పీ అంటున్నారు. ప్రతాప్ మైసూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు అన్నారు. ప్రతాప్ పట్ట ఇలాంటి నీచమైన పని చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని అతని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.