Daughter: ప్రియుడితో కూతర్ని రేప్ చేపించిన ఆంటీ, కన్నతల్లి అని నమ్మితే ?, భర్తకు పంగనామాలు !
ముంబాయి/ ఔరంగాబాద్: భర్తతో కాపురం చేసిన భార్య ఓ కుమార్తెకు, కుమారుడికి తల్లి అయ్యింది. భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. ఈ విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. దంపతుల మద్య తేడా రావడంతో విడిపోయారు. దంపతుల 17 ఏళ కుమార్తె, ఆమె తమ్ముడు తండ్రితో కలిసి ఉంటున్నారు. తల్లి ఆమె ప్రియుడితో కలిసి వేరే కాపురం పెట్టింది. కన్నతల్లిని మాట్లాడటానికి కూతురు, కొడుకు వెళ్లారు. కొడుకును బంధువుల ఇంటికి పంపించిన తల్లి ఆమె కూతురిని ప్రియుడికి అప్పగించింది. తల్లి ప్రియుడు ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. పదేపదే తల్లి ప్రియుడు లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఈ విషయం బయటకు రాకూడదని అని ఆలోచించిన తల్లి కన్న కూతురిని ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ప్రయత్నించింది. అమ్మాయి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కసాయి తల్లి, ఆమె ప్రియుడు కటకటాలపాలైనారు. కామాంధులను పోలీసు కస్టడీకి ఇవ్వడంతో ఇద్దరికి అసలు సినిమా మొదలైయ్యింది.
RRR: ఆర్ఆర్ఆర్ కన్నడ పాట రిలీజ్, మీడియా ప్రశ్నలకు ఒకేఒక్క మాట చెప్పిన దర్శకధీరుడు రాజమౌళి !
భర్తతో కాపురం చేస్తే కూతురు, కొడుకు
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో రష్మీ, రాకేష్ (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్, రష్మీ దంపతులకు 17 ఏళ్ల కుమార్తె, 13 సంవత్సరాల కుమారుడు ఉన్నారు. మొదట భర్త రాకేష్ తో పాటు కూతురు కొడుకుతో కలిసి 42 ఏళ్ల రష్మీ చాలా సంతోషంగా ఉండేదని సమాచారం.
ప్రియుడి మోజులో పడి భర్తకు విడాకులు
రష్మీ ఓ ప్రియుడిని సెట్ చేసుకుని ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టింది. రాకేష్ భార్య రష్మీ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో విచ్చలవిడిగా ఎంజాయ్ చేసింది. భార్య రష్మీ అక్రమ సంబంధం విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. ఇదే విషయంలో రష్మీ, రాకేష్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. కొన్ని సంవత్సరాల క్రితం రాకేష్, రష్మీ దంపతుల మద్య తేడా రావడంతో ఇద్దరూ విడిపోయారు.
తల్లిని పలకరించడానికి వెళితే ?
రష్మీ 55 ఏళ్ల వయసు ఉన్న సంతోష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో కలిసి జీవిస్తోంది. 2020 ఆగస్టు నెలలో 17 ఏళ్ల అమ్మాయి, ఆమె తమ్ముడు కన్న తల్లి రష్మీతో మాట్లాడటానికి ఆమె ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో రష్మీ కూతురి మీద సంతోష్ కన్ను వేశాడు.
ప్రియుడికి కూతుర్ని అప్పగించిన కసాయి తల్లి
కొడుకును బంధువుల ఇంటికి పంపించిన రష్మీ ఆమె 17 ఏళ్ల కూతురిని ప్రియుడు సంతోష్ కు అప్పగించింది. తల్లి రష్మీ ప్రియుడు సంతోష్ ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. పదేపదే తల్లి ప్రియుడు లైంగిక వేధింపులకు గురి చేశాడు. టార్చర్ తట్టుకోలేక అమ్మాయి
ఇంటి నుంచి పారిపోయింది. అయితే ఉండటానికి ఎక్కడా ఆశ్రయం చిక్కకపోవడంతో మళ్లీ ఆ అమ్మాయి తల్లి రష్మీ ఇంటికి చేరుకుంది.
ప్రియుడితో కూతురి పెళ్లి చెయ్యలని ప్రయత్నించిన తల్లి
కూతుర్ని వదిలేస్తే ఎప్పటికైనా పోలీసుల నుంచి సమస్యలు వస్తాయని రష్మీ ఆలోచించింది. తన కూతురి మీద ప్రియుడు సంతోష్ అత్యాచారం చేసిన విషయం బయటకు రాకూడదని అని ఆలోచించించింది. రష్మీ ఆమె కన్న కూతురిని ఆమె ప్రియుడు సంతోష్ కు ఇచ్చి పెళ్లి చెయ్యడానికి ప్రయత్నించింది.
తల్లీ, ప్రియుడి మీద కేసు పెట్టిన అమ్మాయి
అమ్మాయి తప్పించుకుని పారిపోయి చైల్డ్ వెల్ఫేర్ అధికారులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కసాయి తల్లి, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం అననుమతితో కామాంధులను కస్టడీకి తీసుకున్న పోలీసులు బెండ్ తియ్యడంతో ఇద్దరికి అసలు సినిమా మొదలైయ్యింది.