ముంబైలో దావూద్ సోదరుడి కొడుకు అరెస్ట్
ముంబై : దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ కుమారుడు అరెస్ట్ అయ్యాడు. రిజ్వాన్ కస్కర్ దేశం విడిచి పారిపోతుండగా యాంటీ ఎక్స్టార్షన్ విభాగం అరెస్ట్ చేసింది. దావూద్ ముఠాకు చెందిన అహ్మద్ రజా వధారియాను దుబాయ్లో అరెస్ట్ చేసిన రెండు రోజులకే రిజ్వాన్ అరెస్ట్ అయ్యాడు.
అహ్మద్ రజాను ఓ దోపిడీ కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకున్నారు. రజాతో సంబంధాలున్నందునే రిజ్వాన్కు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.దావూద్ సోదరుడైన ఇక్బాల్ కస్కర్ కొడుకు రిజ్వాన్ కస్కర్. రిజ్వాన్ను ప్రస్తుతం అధికారులు ప్రశ్నిస్తున్నారు.
1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడైన దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్థాన్లోని కరాచీలో తలదాచుకుంటున్నాడు. దావూద్ పాకిస్థాన్లో ఆశ్రయం పొందుతున్నాడనడానికి సాక్ష్యంగా కొన్ని ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. దావూద్ తమ భూభాగంలో ఉన్నట్లు ఎన్ని ఆధారాలు చూపినా పాక్ మాత్రం నిరాకరిస్తోంది.