పాస్పోర్ట్ కావాలంటే మతం మారండి!: హిందూ-ముస్లీం జంటకు చేదు, స్పందించిన సుష్మా
లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ఓ జంటకు పాస్పోర్టు కార్యాలయంలో చుక్కెదురైంది. ఓ ముస్లీం యువకుడు, హిందూ యువతి పెళ్లి చేసుకున్నారు. ఆ ముస్లీం యువకుడి పేరు మొహమ్మద్ అనాస్ సిద్ధిఖి. సిద్ధికి 2007లో తన్వి అనే హిందూ యువతిని పెళ్లి చేసుకున్నాడు.
తమకు పాస్ పోర్టు కార్యాలయంలో చేదు అనుభవం ఎదురైందంటూ తన్వి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేశారు. తమను లక్నోలో పాస్ పోర్టు అధికారి ఎలా అవమానించాడో చెప్పింది.
సిద్ధికి, తన్విలు నోయిడాలోని ఓ బహుళ జాతి కంపెనీలో ఉద్యోగులు. వీరికి ఆరేళ్ల పాప ఉంది. వీరిద్దరు పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వికాస్ అనే అధికారి తన్వి, సిద్ధికులపై మండిపడుతూ.. మీ వివాహం చెల్లదని చెప్పారు. నీవు హిందూమతంలోకి మారాలని సిద్ధిఖికి చెప్పారు. తమకు జరిగిన అవమానాన్ని తన్వి సుష్మాతో పాటు ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
A day after an inter-faith couple tweeted to Sushma Swaraj narrating the humiliation they had to face at the city passport office, accused officer Vikas Mishra has been transferred. https://t.co/KcEdEJAN9B
— News18 (@CNNnews18) June 21, 2018
సదరు పాస్ పోర్టు అధికారి తన పాస్పోర్టును, తన భర్త పాస్పోర్టును హోల్డ్లో పెట్టారని తన్వి సేథ్ పేర్కొన్నారు. సిద్ధిఖి కూడా మాకు సహాయం చేయాలని సుష్మా స్వరాజ్కు, పీఎంవోకు, పాస్పోర్ట్సేవామేకు, ఎంఈఐఇండియాకు ట్యాగ్ చేశారు.
స్పందించిన సుష్మా స్వరాజ్
సిద్ధిఖి, తన్వీ సేథ్ ఫిర్యాదు పైన సుష్మా స్వరాజ్ జోక్యం చేసుకున్నారు. సదరు అధికారి వికాస్ను ట్రాన్సుఫర్ చేశారు. మరోవైపు, దీనిపై ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ సెక్రటరీ డీఎం ములాయ్ కూడా స్పందించారు. ఆ జంటకు ఇబ్బంది కలిగినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. లక్నో కార్యాలయం నుంచి సమాచారం తీసుకొని, తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ తర్వాత అధికారి ట్రాన్సుఫర్ అయ్యారు.